News March 5, 2025
జగిత్యాలలో జోరుగా మట్టి బాటిల్స్ విక్రయాలు

జగిత్యాల జిల్లా కేంద్రంలో మట్టి బాటిల్స్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. రోజు రోజుకు వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతుంది. వేసవి కాలం కావడంతో మట్టితో బాటిల్స్ ను తయారు చేసి రోడ్లపై విక్రయిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారాలు బాటిల్స్ ను ఒక్కదానికి రూ.80 నుంచి రూ.100 కు విక్రయిస్తున్నారు. ఫ్రిడ్జ్ ల నీరు తాగే బదులు సహజంగా చల్లగా అయ్యే మట్టి బాటిల్స్ ను కొనడానికి జనం ఆసక్తి చూపుతున్నారు.
Similar News
News November 15, 2025
17 నెలల్లో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం

AP: చరిత్ర తిరగరాసేలా విశాఖ సీఐఐ సదస్సు సూపర్ హిట్టయ్యిందని సీఎం చంద్రబాబు చెప్పారు. ‘613 ఒప్పందాల ద్వారా రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. దేశవిదేశాల నుంచి సమ్మిట్లో 5,587 మంది ప్రముఖులు పాల్గొన్నారు. మొత్తంగా 17 నెలల్లోనే రూ.20 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు సాధించాం. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం’ అని తెలిపారు.
News November 15, 2025
ఈషాసింగ్కు CM రేవంత్ అభినందనలు

TG: కైరో(EGYPT)లో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ ఛాంపియన్ షిప్లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ క్రీడాకారిణి ఈషాసింగ్కు CM రేవంత్ అభినందనలు తెలిపారు. ‘మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. షూటింగ్లో పట్టుదలతో సాధన చేస్తూ ఈషాసింగ్ ఎంతోమంది క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. భవిష్యత్తులో మరింతగా రాణించాలి’ అని ముఖ్యమంత్రి ఆకాంక్షించినట్లు CMO ట్వీట్ చేసింది.
News November 15, 2025
జగిత్యాల: విద్యార్థులకు అందుబాటులో హాల్టికెట్స్

నేషనల్ మెయిన్స్-కం-మెరిట్ స్కాలర్షిప్ (NMMS) పరీక్ష-2025 నిర్వహణకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ హాల్టికెట్లను bse.telangana.gov.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని డీఈఓ రాము తెలిపారు.జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లిలలోని 6 కేంద్రాల్లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష జరుగుతుందని, విద్యార్థులు సమయానికి ముందే గుర్తింపు పత్రాలతో హాజరుకావాలని ఆయన సూచించారు.


