News April 10, 2025

జగిత్యాలలో దొంగ అరెస్ట్‌.. బంగారు ఆభరణాలు స్వాధీనం

image

పలు చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను జగిత్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మంచిర్యాల జిల్లా బక్క శెట్టి కొమురయ్యగా గుర్తించారు. అతని నుంచి రూ.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు 25కుపైగా దొంగతనాలకు పాల్పడ్డాడని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. నిందితుడిని రిమాండుకు తరలించారు.

Similar News

News October 19, 2025

నోబెల్ అవార్డు గ్రహీత కన్నుమూత

image

నోబెల్ అవార్డు గ్రహీత, భౌతిక శాస్త్రవేత్త చెన్ నింగ్ యంగ్ కన్నుమూశారు. 1922లో జన్మించిన ఆయన కణ భౌతిక శాస్త్రంలో సైంటిస్టుగా ఎదిగారు. 1957లో పరిశోధనలకు‌గానూ నోబెల్ బహుమతి అందుకున్నారు. 1964లో అమెరికా పౌరసత్వం పొందగా 2015లో వదులుకున్నారు. చైనా సంస్కృతి నరనరాల్లో ఉండటమే దానికి కారణమని ఓ సందర్భంలో చెప్పారు. ఆయన మరణాన్ని స్థానిక మీడియా ధ్రువీకరించింది.

News October 19, 2025

KNR: మద్యం దుకాణాలకు దరఖాస్తుల వెల్లువ

image

ఉమ్మడి KNR జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. శనివారం ఉదయం నుంచే అభ్యర్థులతో ఎక్సైజ్ కార్యాలయాలు కిటకిటలాడాయి. శనివారం నాటికి కరీంనగర్ జిల్లా(94)లో 2,519, జగిత్యాల(71)లో 1,766, పెద్దపల్లి(74)లో 1354, రాజన్న సిరిసిల్ల(48)1,324 దరఖాస్తులు వచ్చాయి. కాగా షాపులకు దరఖాస్తుల గడువును ఈనెల 23 వరకు పొడిగించడంతో దరఖాస్తుల సంఖ్యం ఇంకా పెరగనున్నాయి.

News October 19, 2025

ఏలూరులో నేటి మాంసం ధరలు ఇలా!

image

నూజివీడులో మాంసం ధరలు స్వల్పంగా పెరిగాయి. కిలో మటన్ రూ.800 రూపాయలు, చికెన్ రూ.220, రొయ్యలు రూ.300 రూపాయలు, చేపలు రూ.180 నుంచి 380 రూపాయలకు విక్రయిస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో కిలో మటన్ రూ.900 రూపాయలు, చికెన్ రూ.220 నుంచి 280 రూపాయలు, కిలో చేపలు రూ.150 నుంచి 400 రూపాయలు, కిలో రొయ్యలు రూ.300 రూపాయలుగా విక్రయిస్తున్నారు.