News April 10, 2025
జగిత్యాలలో దొంగ అరెస్ట్.. బంగారు ఆభరణాలు స్వాధీనం

పలు చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను జగిత్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మంచిర్యాల జిల్లా బక్క శెట్టి కొమురయ్యగా గుర్తించారు. అతని నుంచి రూ.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు 25కుపైగా దొంగతనాలకు పాల్పడ్డాడని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. నిందితుడిని రిమాండుకు తరలించారు.
Similar News
News December 3, 2025
ఖమ్మం: తొలి రెండు రోజులు మద్యం కిక్కు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మద్యం విక్రయాల కిక్కు అదిరింది.. 2025-27 ఎక్సైజ్ సంవత్సరానికి కేటాయించిన మద్యం దుకాణాల్లో సోమవారం నుంచి మద్యం విక్రయాలు మొదలయ్యాయి. తొలి రెండు రోజులు ఉమ్మడి జిల్లాలోని 204 వైన్ షాపులకు వైరాలోని ఐఎంఎల్ డిపో నుంచి సుమారు రూ.40 కోట్ల మద్యం సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు. గత ఎక్సైజ్ సంవత్సరం ముగింపు చివరి నెల రోజులు వైన్ షాపుల్లో ఆశించిన మేర మద్యం విక్రయాలు జరగలేదు.
News December 3, 2025
ఖమ్మం: అర్ధరాత్రి పొద్దుపోయేంతవరకు నామినేషన్లు

ఖమ్మం జిల్లాలో రెండో విడత నామినేషన్ల దాఖలు పూర్తయ్యాయి. అర్ధరాత్రి పొద్దుపోయేంతవరకు నామినేషన్లు దాఖలు చేశారు. 6 మండలాల్లో మొత్తం 183 గ్రామపంచాయతీలకు గాను 1055 నామినేషన్లు దాఖలయ్యాయి. అదే విధంగా 1686 వార్డులకు గాను 4160 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కూసుమంచి మండలంలో అత్యధికంగా సర్పంచ్ పదవికి 250 మంది నామినేషన్లు దాఖలు చేయడం విశేషం.
News December 3, 2025
VJA: బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి.. కోర్టు తీర్పు ఇదే.!

పోక్సో కేసులో నిందితుడికి న్యాయస్థానం జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. అజిత్సింగ్నగర్కు చెందిన ఓ బాలికతో 2021వ సంవత్సరంలో అదే ప్రాంతానికి చెందిన వసంత్ కుమార్ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లి ఫిర్యాదు మేరకు వసంత్ కుమార్పై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా మంగళవారం నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి భవాని తీర్పునిచ్చారు.


