News April 10, 2025
జగిత్యాలలో దొంగ అరెస్ట్.. బంగారు ఆభరణాలు స్వాధీనం

పలు చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను జగిత్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మంచిర్యాల జిల్లా బక్క శెట్టి కొమురయ్యగా గుర్తించారు. అతని నుంచి రూ.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు 25కుపైగా దొంగతనాలకు పాల్పడ్డాడని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. నిందితుడిని రిమాండుకు తరలించారు.
Similar News
News February 9, 2026
మహబూబాబాద్ జిల్లాలో ఈనెల 11న సెలవు: కలెక్టర్

ఈనెల 11న జిల్లాలోని మహబూబాబాద్, మరిపెడ, తొర్రూర్, కేసముద్రం, డోర్నకల్లలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల్లో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు స్థానికంగా హాలిడే ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
News February 9, 2026
నల్గొండలో రేపే సదస్సు.. మిస్ అవ్వకండి..!

బాల్యం తర్వాత కొత్త జీవితంలోకి తొలి అడుగు వేసేది 10th క్లాస్ తర్వాతే. అలాంటి కీలకమైన దశలో స్టూడెంట్స్తోపాటు వారి తల్లిదండ్రులు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా Way2News & Resonance సంస్థ సంయుక్తంగా ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాయి. నల్గొండలోని Alimineti Madhava Reddy Police Auditoriumలో FEB 10న సా.6 గంటలకు జరిగే ఈ సదస్సులో CBI EX జేడీ లక్ష్మీనారాయణ పాల్గొని మార్గనిర్దేశం చేయనున్నారు.
News February 9, 2026
ఖమ్మం: ఏకంగా జిల్లా జైలుకే ‘కుళ్లిన మటన్ SUPPLY’

ఖమ్మం నగరంలోని మూడు బొమ్మల సెంటర్ వద్దగల ఓ మటన్ షాపుపై మున్సిపల్ అధికారులు మెరుపు దాడి చేశారు. డీప్ ఫ్రిజ్లో నిల్వ ఉంచిన 30 కేజీల కుళ్లిపోయిన, దుర్వాసన వస్తున్న మాంసాన్ని గుర్తించి సీజ్ చేశారు. కాగా, సదరు మటన్ యజమాని జిల్లా జైలుతో పాటు పలు హోటళ్లకు మాంసం సరఫరా చేసే కాంట్రాక్టర్గా ఉండటం గమనార్హం. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఇలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


