News February 17, 2026
జగిత్యాలలో వి’చిత్రం’.. వారికే వరుసగా వైస్ ఛైర్మన్ కుర్చీ

జగిత్యాల మున్సిపల్లో ఇప్పటివరకు ఏర్పడిన అన్ని పాలకవర్గాల్లో ప్రతిసారి వైస్ఛైర్మన్ పదవికి ఒకే ప్రాంతం నుంచి ఎన్నికవ్వడం ఆనవాయితీగా వస్తోంది. వార్డుల విభజన జరిగిన ప్రతీసారి వార్డ్ మెంబర్ మారినా, పట్టణంలోని గంజి ప్రాంతం నుంచే ఎన్నికవుతున్నారు. వీరిలో బదురోద్దిన్, యూసఫ్ అజాద్, కోటగిరి మురళి, మన్సూర్, గోలి శ్రీనివాస్ వైస్ఛైర్మన్ కాగా ప్రస్తుతం జీనత్ పర్వీన్ కూడా గంజి ఏరియా నుంచే ఎన్నికవ్వడం విశేషం.
Similar News
News March 17, 2026
గవర్నర్ ప్రసంగంలో ఆదిలాబాద్ AIRPORT ప్రస్తావన

ఆదిలాబాద్ AIRPORT నిర్మాణంలో కీలక అడుగు ముందుపడింది. అసెంబ్లీ సమావేశాల్లో స్వయంగా గవర్నర్ తన ప్రసంగంలో AIRPORT పై ప్రసంగించడంతో జిల్లా వాసుల ఆశలు మరింత రెట్టింపు అయ్యాయి. AIRPORT ఏర్పాటు ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించిందని.. పనుల వేగవంతానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. జూన్ 2న ప్రధాని మోదీ చేతులమీదుగా శంకుస్థాపన చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.
News March 17, 2026
ADB: రెండు, మూడు రోజుల్లో శనగ కొనుగోళ్లు ప్రారంభం

ఆదిలాబాద్ జిల్లాలో రెండు మూడు రోజుల్లో శనగ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు మార్క్ఫెడ్ DM ప్రవీణ్ కుమార్ తెలిపారు. క్వింటాల్కు రూ. 5,875 మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేయనుందని పేర్కొన్నారు. రైతులు తమ పంటను శుభ్రపరిచి, తేమ శాతం 14% మించకుండా ఆరబెట్టి కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. గ్రామాల వారీగా కేటాయించిన తేదీల్లోనే పంటను తేవాలని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News March 17, 2026
నేడు సచివాలయానికి సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు నేటి పర్యటన వివరాలు ఖరారయ్యాయి. ఉదయం 11 గంటలకు ఆయన రాష్ట్ర సచివాలయానికి చేరుకుంటారు. అనంతరం 11.30 గంటలకు రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ) పనితీరుపై అధికారులతో ఆయన కీలక సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆయా కార్యక్రమాలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం 3.20 గంటలకు సీఎం చంద్రబాబు తిరిగి తన నివాసానికి చేరుకుంటారు.


