News February 1, 2025

జగిత్యాలలో వ్యక్తి ఆత్మహత్య

image

జగిత్యాల పట్టణంలోని టాకా సంధిలో శనివారం ఆర్థిక ఇబ్బందులతో గుండేటి దేవేందర్ (55) బాత్రూంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. అతడు గతంలో అంగడిలో బట్టల వ్యాపారం చేయగా వ్యాపారంలో నష్టం రావడంతో టెంట్ హౌస్‌లో పని చేస్తూ జీవిస్తున్నాడన్నారు. అయితే మృతుడికి అప్పులు ఉన్నాయని, ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకున్నాడని దేవేందర్ భార్య పోలీసులకు తెలిపింది. అతడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

Similar News

News November 18, 2025

సీనియర్ నేతలను వదులుకొని KCR తప్పు చేశారు: కవిత

image

సీనియర్ నేతలను వదులుకొని KCR తప్పు చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ మాజీ MP కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. మంగళవారం ఆమె జాగృతి జనం బాటలో భాగంగా మీడియాతో మాట్లాడారు. 20 ఏళ్లు పనిచేసిన తనను కుట్ర చేసి పార్టీ నుంచి, కుటుంబం నుంచి దూరం చేశారని అన్నారు. తనపై ఇంకా నీచస్థాయిలో దాడులు చేస్తున్నారని, అయినా సరే ఎవ్వరికీ బెదిరేదే లేదని కవిత స్పష్టం చేశారు.

News November 18, 2025

సీనియర్ నేతలను వదులుకొని KCR తప్పు చేశారు: కవిత

image

సీనియర్ నేతలను వదులుకొని KCR తప్పు చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ మాజీ MP కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. మంగళవారం ఆమె జాగృతి జనం బాటలో భాగంగా మీడియాతో మాట్లాడారు. 20 ఏళ్లు పనిచేసిన తనను కుట్ర చేసి పార్టీ నుంచి, కుటుంబం నుంచి దూరం చేశారని అన్నారు. తనపై ఇంకా నీచస్థాయిలో దాడులు చేస్తున్నారని, అయినా సరే ఎవ్వరికీ బెదిరేదే లేదని కవిత స్పష్టం చేశారు.

News November 18, 2025

తెలంగాణలో అతిపెద్ద BESS సౌర ప్రాజెక్టు

image

TG: బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS)తో 1500 MW సౌర విద్యుత్ ప్లాంట్ రాష్ట్రంలో ఏర్పాటుకానుంది. కేంద్రం ఆమోదించిన అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. మహేశ్వరం, చౌటుప్పల్ ప్రాంతాల్లో TGGENCO ఈ ప్లాంట్లను అభివృద్ధి చేస్తుంది. ఈమేరకు ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి GO విడుదల చేశారు. దీని ద్వారా అందే విద్యుత్ యూనిట్‌ ధర ₹2.90 మాత్రమే. ఇప్పటికే AP, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నాయి.