News April 5, 2025
జగిత్యాల: అంబేడ్కర్ జయంతి ఉత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరణ

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈనెల 14 నిర్వహించే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి ఉత్సవాల వాల్ పోస్టర్ను SC, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ వెంకటయ్య శనివారం ఆవిష్కరించారు. జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ బి ఎస్ లత, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఉత్సవాల కమిటీ జిల్లా ఛైర్మన్ భాస్కర్ ఉన్నారు.
Similar News
News October 14, 2025
జనగామ: వేటగాళ్ల ఉచ్చులో పడి జింక మృతి

స్టేషన్ఘనపూర్ మండలం విశ్వనాథపురం గ్రామంలో సోమవారం వేటగాళ్ల ఉచ్చులో పడి జింక మృతి చెందింది. గ్రామస్తులు ఈ విషయాన్ని సంబంధిత అటవీ అధికారులకు తెలిపారు. తరచూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అటవీ, పోలీసు శాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు.
News October 14, 2025
ADB: బెస్ట్గా నిలవాలంటే.. బకాయిలు ఇవ్వాల్సిందే

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ బకాయిలు వెంటనే విడుదల చేసి, ఆ స్కూల్స్ యథావిధిగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. రెండున్నర సంవత్సరాలుగా స్కూల్ యాజమాన్యాలకు బిల్లులు విడుదల కాకపోవడంతో పిల్లలను బడుల్లోకి రానీయడం లేదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 15+ స్కూల్స్లో విద్యార్థులు చదువుకుంటున్నారు. బకాయిలు ఇవ్వాలని కోరుతున్నారు.
News October 14, 2025
నిర్మల్: మళ్లీ ఆయనకే ‘హస్తం’ పగ్గాలు..?

కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడి పదవికి సంబంధించి పీసీసీ పరిశీలకుల పర్యటన జిల్లాలో కొనసాగుతోంది. అయితే ఈ పదవిని మళ్లీ కూచాడి శ్రీహరి రావుకి కేటాయిస్తారని అంతటా చర్చ నడుస్తోంది. పార్టీ అధికారంలోకి రాక ముందు నుంచి చురుకుగా కార్యక్రమాలు నిర్వహించారని ఇప్పటికీ యాక్టివ్గా ఉన్నారని మద్దతుదారులు పేర్కొంటున్నారు. అయితే ఈ పదవికి ఆనంద్ రావు పటేల్, ఎంబడి రాజేశ్వర్ తదితరులు దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది.