News April 5, 2025
జగిత్యాల: అంబేడ్కర్ జయంతి ఉత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరణ

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈనెల 14 నిర్వహించే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి ఉత్సవాల వాల్ పోస్టర్ను SC, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ వెంకటయ్య శనివారం ఆవిష్కరించారు. జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ బి ఎస్ లత, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఉత్సవాల కమిటీ జిల్లా ఛైర్మన్ భాస్కర్ ఉన్నారు.
Similar News
News November 21, 2025
రంగేస్తున్నారా? ఇవి తెలుసుకోండి

గతంలో తెల్ల జుట్టు వస్తేనే రంగేసుకొనేవారు. కానీ ఇప్పుడు ఫ్యాషన్, ట్రెండ్ అంటూ రకరకాల రంగులతో జుట్టు స్వరూపాన్ని మార్చేస్తున్నారు. దీనికి ముందు కొన్ని టిప్స్ పాటించాలంటున్నారు నిపుణులు. చర్మ రంగుని బట్టి జుట్టు రంగును ఎంచుకోవాలి. రంగు మాత్రమె కాదు షేడ్ కూడా చూసుకోవాలి. లేదంటే జుట్టు, మీ అందం చెడిపోతాయి. మొదటిసారి రంగేస్తున్నట్లయితే వీలైనంత వరకు నిపుణులను సంప్రదించడం మంచిది.
News November 21, 2025
మార్గశిరం వచ్చేసింది.. ఈ వ్రతాలు చేస్తున్నారా?

విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన మార్గశిర మాసంలో కొన్ని ముఖ్యమైన వ్రతాలను ఆచరిస్తారు. పెళ్లి కాని అమ్మాయిలు మంచి భర్త రావాలని కాత్యాయనీ వ్రతం చేస్తారు. గురువారాల్లో మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని చేస్తే రుణ సమస్యలు తొలగి, సంపద, ఆరోగ్యం కలుగుతాయని నమ్మకం. మనోధైర్యం, ధృడ సంకల్పం, దుష్ట గ్రహాల ప్రభావం నుంచి రక్షణ కోసం హనుమద్వ్రతం చేస్తారు. ☞ ఏ వ్రతం ఎప్పుడు, ఎలా చేయాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.
News November 21, 2025
జిల్లాలో భారీగా పంటల కొనుగోలు: నిర్మల్ కలెక్టర్

పంటల కొనుగోలుపై కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులతో సమీక్షా నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు 14,760.56 క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. దీంతో పాటు 5,746 క్వింటాళ్ల సోయా, 7,715 క్వింటాళ్ల మొక్కజొన్న, 66,140 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతులు పండించిన మొత్తం పంటను కొనుగోలు చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ హామీ ఇచ్చారు.


