News March 20, 2025
జగిత్యాల: అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించాలి: అడిషనల్ కలెక్టర్

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో జాప్యం లేకుండా త్వరగా పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని అడిషనల్ కలెక్టర్ బిఎస్.లత అన్నారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జగిత్యాలలో గురువారం నిర్వహించిన డిస్టిక్ లెవెల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. సమావేశంలో ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్ రెడ్డి, శ్రీనివాస్, డిఎస్పీలు రఘుచందర్, రాములు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 17, 2025
ఉమ్మడి కరీంనగర్లో 1,27,920 మంది ఓటర్లు

లోకల్ వార్ ఫైనల్కు చేరింది. నేటితో ఎన్నికల సంగ్రామం ముగియనుంది. ఉమ్మడి కరీంనగర్లో 1,27,920మంది ఓటర్లు ఉండగా 388 GPలకు, 1580 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. కరీంనగర్లో 80,190మంది మహిళలు, 84,853మంది పురుషులు, పెద్దపల్లిలో 73,669మంది మహిళలు, 70,892మంది పురుషులు, సిరిసిల్లలో 61,928మంది మహిళలు, 65,992మంది పురుషులు, జగిత్యాలలో 89,959మంది మహిళలు, 85,061మంది పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
News December 17, 2025
30కి పైగా దేశాలపై ట్రంప్ ట్రావెల్ బ్యాన్

US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరిన్ని దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు. ఇటీవల 12 దేశాలపై విధించగా, ఇప్పుడు ఆ సంఖ్య 30కి పైనే ఉంది. పాలస్తీనా, సిరియా, జింబాబ్వే సహా అనేక దేశాలు ఈ లిస్ట్లోకి వచ్చాయి. ఇమ్మిగ్రేషన్పై కఠిన చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆ దేశ పౌరుల రికార్డుల విషయంలో నమ్మకం లేకపోవడంతో పాటు అవినీతి, క్రిమినల్ కేసులు వంటివి కారణాలుగా పేర్కొన్నారు.
News December 17, 2025
SRCL: ఫర్టిలైజర్ యాప్పై అవగాహన సదస్సు

రైతులకు ఎరువుల సరఫరా విషయంలో ఇబ్బందులు దూరం చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన ఫెర్టిలైజర్ యాప్పై అవగాహన కల్పించాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. ఫెర్టిలైజర్ యాప్పై అవగాహన, ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణ లక్ష్యాల సాధన గురించి వివరించాలన్నారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, వ్యవసాయ శాఖాధికారి అఫ్టల్ బేగం, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


