News March 24, 2024
జగిత్యాల: అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలుశిక్ష

గొల్లపల్లి మండలం దట్నూరుకు చెందిన హరికృష్ణ A/S హరీష్ కిరాణం నిర్వహిస్తుండేవాడు. సరుకుల కోసం వచ్చే బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఓ బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పగా 2022 ఏప్రిల్ 7న పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. శనివారం నేరం రుజువు కావడంతో JGL న్యాయమూర్తి నీలిమ ఒక్కోకేసులో 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.5 లక్షల జరిమానా, ముగ్గురు బాలికలకు 5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పారు.
Similar News
News December 2, 2025
ఉస్మానియా పార్కులో రాజాపూర్ విద్యార్థి ఆత్మహత్య

శంకరపట్నం మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి రెడ్డి విజ్ఞాన్ తేజ (19) ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్నాడు. మైనింగ్ విభాగంలో రెండో సంవత్సరం చదువుతున్న విజ్ఞాన్ తేజ, సోమవారం రాత్రి ఉస్మానియా ఆక్సిజన్ పార్కులో ఓ చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హుటాహుటిన హైదరాబాద్కు బయలుదేరినట్లు గ్రామస్థులు తెలిపారు.
News December 2, 2025
KNR: బహిరంగ మద్యపానంపై నిషేధం పొడిగింపు

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజల భద్రత, శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని డ్రోన్ల వినియోగం, భారీ డీజే సౌండ్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై నిషేధాజ్ఞలను ఈనెల 31 వరకు పొడిగిస్తున్నట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. భద్రతాపరమైన అంశాలు, శబ్ద కాలుష్యం, మహిళల రక్షణ దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News December 2, 2025
KNR: ఎన్నికల బందోబస్తుపై సీపీ గౌష్ ఆలం సమీక్ష

గ్రామ పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. సీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి సారించాలని, ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని సూచించారు. రూట్ మొబైల్ బృందాలు నిరంతరం పర్యవేక్షించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.


