News February 16, 2025
జగిత్యాల: అధికారులతో కలెక్టర్ సమీక్ష

జిల్లాలో అర్హత ఉన్న నిరుపేదలందరికీ ఇల్లు నిర్మించాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని, ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు విధులు నిర్వహించాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. శనివారం కలెక్టర్లో గృహ నిర్మాణ శాఖ, ఎంపీడీవో, ఎంపీవో, ఏఈడీఈ, పంచాయతీ సెక్రటరీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయనతో పాటు అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి, డీఆర్డీవో రఘువరన్ ఉన్నారు.
Similar News
News March 8, 2026
వాల్మికిపురం: స్కూటర్ ఢీకొని తల్లి మృతి.. బిడ్డకు సీరియస్

స్కూటర్ ఢీకొని తల్లి మృతి చెందడంతో ఆమె కుమారుడు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. శనివారం రాత్రి వాల్మీకిపురం మండలంలో జరిగిన ఘటనపై ఎస్సై తిప్పేస్వామి వివరించారు. గుర్రంకొండ మండలం రామాపురంకి చెందిన మురళి భార్య రెడ్డిలక్ష్మి ఆమె కుమారుడు బాలాజీ బైకులో సొంతపనిపై చింతపర్తికి వచ్చారు. పనిముగించుకుని తిరిగి స్వగ్రామానికి బైకులో వెళుతుండగా.. వాల్మీకిపురం బైపాస్లో స్కూటర్ ఢీకొని తల్లి మృతి చెందింది.
News March 8, 2026
మహిళా దినోత్సవ వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు: కలెక్టర్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. కుడా కార్యాలయంలో జరిగిన సమీక్షలో మహిళా సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొనేలా చూడాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ స్టాల్స్ ఏర్పాటు, వేదిక తదితర ఏర్పాట్లు సమన్వయంతో చేయాలని పేర్కొన్నారు.
News March 8, 2026
దేశంలో మరో UT ఏర్పాటంటూ వార్తలు.. ఖండించిన కేంద్రం

WBలోని సిలిగుడి కారిడార్ సమీపంలో కొత్త కేంద్ర పాలిత ప్రాంతం(UT) ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఓ వార్త వైరలవుతోంది. ఇందులో బిహార్, బెంగాల్లోని 6 జిల్లాలు ఉంటాయంటూ పలువురు పోస్టులు చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని PIB Fact Check ఖండించింది. కాగా ఈశాన్య రాష్ట్రాలకు రోడ్డు, రైలు మార్గాలు సిలిగుడి నుంచే వెళ్తాయి. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, చైనాకు ఇది సమీపంలో ఉండటంతో ప్రాధాన్యం సంతరించుకుంది.


