News February 1, 2025
జగిత్యాల: అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్ XI విజయవంతం:ఎస్పీ

జిల్లాలోని అన్నిశాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్ XI విజయవంతంగా నిర్వహించామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహించి తప్పిపోయిన మహిళలను గుర్తించి వారి తల్లితండ్రుల వద్దకు చేర్చడానికి ఉపయోగపడుతుందన్నారు. బాలల హక్కులు కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
Similar News
News October 19, 2025
జూరాలకు తగ్గిన వరద

ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గింది. కర్ణాటక ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలను నిలిపివేయడంతో ఆదివారం సాయంత్రం జూరాలకు 28 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో ప్రాజెక్టు అన్ని గేట్లను మూసివేశారు. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తికి, వివిధ కాలువల ద్వారా మొత్తం 32,362 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
News October 19, 2025
NZB: పోలీసులకు సోషల్ మీడియాలో అభినందనల వెల్లువ

విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ ప్రమోద్పై దాడి చేసి చంపిన రియాజ్ను పోలీసులు ఆదివారం పట్టుకున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో పోలీసులకు మద్దతుగా అభినందనల వెల్లువెత్తాయి. ఈ ఘటన జరిగినప్పటి నుంచి సీపీ సాయి చైతన్య నాయకత్వంలో 9 బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు ఆదివారం పోలీసులకు చిక్కాడు. నిందుతుడిని ఎన్ కౌంటర్ చేయాలని సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయపడుతున్నారు.
News October 19, 2025
దీపావళి రోజున లక్ష్మీ పూజ ఎందుకు చేయాలి?

దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి, తన తేజస్సుతో అజ్ఞానమనే చీకటిని తరిమివేసి, భక్తులను అనుగ్రహిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే పండుగ రోజున దీపాలు పెట్టి అమ్మవారిని ఆహ్వానించాలనే ఆచారాన్ని మనం అనాదిగా పాటిస్తున్నాం. నేడు ఇలా దీపాలు వెలిగిస్తే అమ్మవారు మనపై అనుగ్రహం చూపి సంపదలు స్థిరంగా ఉండేలా చేస్తారని నమ్మకం. ఆర్థిక స్థితి మెరుగై, కుటుంబంలోని అడ్డంకులు తొలగిపోతాయని విశ్వసిస్తారు.