News March 19, 2025

జగిత్యాల: అప్పుల బాధతో ఉరివేసుకుని రైతు ఆత్మహత్య

image

జగిత్యాల మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన మతలాపురం రాజం(55) ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం జరిగింది. సాగుకు, ఇంటి అవసరాలకు రూ.10 లక్షలు అప్పుకావడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి కుమారుడు మల్లేష్ తెలిపారు. మల్లేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Similar News

News November 22, 2025

టాస్క్‌ఫోర్స్ అదనపు SPగా కులశేఖర్ బాధ్యతలు

image

ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్(RSSTF)అదనపు SPగా జె.కులశేఖర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో తిరుపతి ASPగా పనిచేసిన ఈయన్ను తాజాగా టాస్క్‌ఫోర్స్‌కు అటాచ్ చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన టాస్క్‌ఫోర్స్ హెడ్, తిరుపతి SP సుబ్బారాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం టాస్క్ ఫోర్స్ SP శ్రీనివాస్‌తో సమావేశమై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

News November 22, 2025

సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం

image

సింగరేణి సీఎండీ బలరామ్ ప్రారంభించిన డయల్ యువర్ సీఎండీ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. అన్ని ఏరియాల నుంచి 40 మంది కార్మికులు ఫోన్ చేసి వివిధ అంశాలపై మాట్లాడారు. కార్మికుల ఫిర్యాదుల స్వీకరణకు, పరిష్కారానికి త్వరలో వాట్సాప్ నెంబరును ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కార్మికులకు ఎదురయ్యే ఇబ్బందులను తెలియజేయడానికి, ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని సీఎండీ వెల్లడించారు.

News November 22, 2025

ముగిసిన నామినేషన్ల ప్రక్రియ: కలెక్టర్

image

మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ బోర్డు ఆప్ డైరెక్టర్ల ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. 48 మంది నుంచి 66 నామినేషన్లు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నామినేషన్లు స్వీకరించినట్లు చెప్పారు. శనివారం 12 మంది అభ్యర్ధులు 14 సెట్ల నామినేషన్లు వేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.