News March 19, 2025
జగిత్యాల: అప్పుల బాధతో ఉరివేసుకుని రైతు ఆత్మహత్య

జగిత్యాల మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన మతలాపురం రాజం(55) ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం జరిగింది. సాగుకు, ఇంటి అవసరాలకు రూ.10 లక్షలు అప్పుకావడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి కుమారుడు మల్లేష్ తెలిపారు. మల్లేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News November 3, 2025
ఎయిమ్స్ రాయ్బరేలిలో జూనియర్ రెసిడెంట్ పోస్టులు

ఎయిమ్స్ రాయ్బరేలి 16 జూనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఎంబీబీఎస్, BDS అర్హతతో పాటు ఇంటర్న్షిప్ చేసినవారు ఈనెల 10న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ట వయసు 37ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. నెలకు రూ.56,100 జీతం అందుతుంది. వెబ్సైట్: https://aiimsrbl.edu.in/
News November 3, 2025
ఎస్ఎల్బీసీ టన్నెల్కు ఏరియల్ సర్వే

నాగార్జునసాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ భద్రత, పనుల పూర్తి కోసం ఏరియల్ ఎలెక్ట్రోమాగ్నెటిక్ సర్వే సోమవారం ప్రారంభం కానుంది. సీఎం, మంత్రి ఉత్తమ్ సమక్షంలో ఎన్జీఆర్ఐ ఆధ్వర్యంలో ఈ హెలిబోర్న్ మాగ్నెటిక్ సర్వే మొదలు పెడతారు. 1000 మీటర్ల లోతు వరకు జియోలాజికల్ డేటా సేకరణ లక్ష్యంగా 200 కిలోమీటర్ల మేర హెలికాప్టర్ ఫ్లైయింగ్ షెడ్యూల్ చేశారు.
News November 3, 2025
MDK: చేవెళ్ల బస్సు ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొన్న ఘోర ప్రమాదంలో 20 మంది దుర్మరణం పాలైన ఘటనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవడంతో పాటు గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.


