News February 2, 2025
జగిత్యాల: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం కలిగోట గ్రామానికి చెందిన డిచ్పల్లి పెద్ద గంగారం (48) అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. రైతు సాగుతో పాటు గొర్రెల కాపరిగా పనిచేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో పెద్ద గంగారాం శనివారం రాత్రి గ్రామశివారులోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నవీన్ కుమార్ పేర్కొన్నారు.
Similar News
News November 21, 2025
భద్రాచలంలో కల్తీ నెయ్యి తయారీ ముఠా అరెస్టు

భద్రాచలంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న ఓ లాడ్జిలో కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ముఠాను ఎస్ఐ సతీష్ నేతృత్వంలో పోలీసులు అరెస్టు చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి తనిఖీ చేయగా, 65 కిలోల కల్తీ నెయ్యి డబ్బాలు లభించాయి. దీని విలువ రూ.52 వేలు ఉంటుందని అంచనా. నిందితులను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
News November 21, 2025
విగ్రహాలను పూజించడం వెనుక సైన్స్

హిందూ మతంలో విగ్రహారాధనను ఎక్కువ ప్రోత్సహిస్తాం. అనేక దేవుళ్లు శిలలా మారడంతో విగ్రహాలే దైవాలని మనం వాటికి పూజలు చేస్తుంటాం. దేవుడు అందులో నుంచే మన మొరను వింటాడని అనుకుంటాం. అయితే ఈ విగ్రహారాధన ఆధ్యాత్మికంగా మనకు ఓ స్పెషల్ ఫోకస్ను అందిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. ప్రార్థన సమయంలో విగ్రహాన్ని చూస్తే.. మన ఆలోచనలు ఆయన రూపంతో అనుసంధానమైన మనల్ని భక్తి పథంలో నడిపిస్తాయని ఓ పరిశోధనలో తేల్చారు.
News November 21, 2025
AIIMS గువాహటిలో 177 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ఎయిమ్స్ గువాహటి 177 Sr. రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు DEC 8 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీజీ (MD/MS/DNB), MSc, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, EWSలకు రూ.500. వెబ్సైట్: https://aiimsguwahati.ac.in.


