News February 18, 2025
జగిత్యాల: ఆదర్శ పాఠశాలల్లో దరఖాస్తుల ఆహ్వానం

జగిత్యాల జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఫిబ్రవరి 28లోగా విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 13న ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు www.telanganams.cgg.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.
Similar News
News November 17, 2025
VJA: రూ.15వేల పెన్షన్కు అర్హులైనతే సర్టిఫికెట్ పొందవచ్చు

పెరాలసిస్, మస్క్యులర్ డిస్ట్రోఫీ, తలసేమియా, కిడ్నీ వ్యాధిగ్రస్థులు, గుండె మార్పిడి వంటి తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతున్న ఎన్టీఆర్ జిల్లా వాసులు రూ. 15వేల పెన్షన్ పొందడానికి ప్రతి మంగళవారం విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ వేంకటేశ్వరరావు సోమవారం తెలిపారు. ఉదయం 9 గంటలకు వచ్చి స్పెషలిస్టుల పరీక్షల అనంతరం సర్టిఫికెట్లు పొందాలని సూచించారు.
News November 17, 2025
VJA: రూ.15వేల పెన్షన్కు అర్హులైనతే సర్టిఫికెట్ పొందవచ్చు

పెరాలసిస్, మస్క్యులర్ డిస్ట్రోఫీ, తలసేమియా, కిడ్నీ వ్యాధిగ్రస్థులు, గుండె మార్పిడి వంటి తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతున్న ఎన్టీఆర్ జిల్లా వాసులు రూ. 15వేల పెన్షన్ పొందడానికి ప్రతి మంగళవారం విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ వేంకటేశ్వరరావు సోమవారం తెలిపారు. ఉదయం 9 గంటలకు వచ్చి స్పెషలిస్టుల పరీక్షల అనంతరం సర్టిఫికెట్లు పొందాలని సూచించారు.
News November 17, 2025
పార్టీపరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు: పొంగులేటి

TG: కాంగ్రెస్ పార్టీ పరంగా BCలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని క్యాబినెట్ నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. తొలుత సర్పంచ్ ఎలక్షన్లు DECలనే నిర్వహిస్తామని అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చితో రూ.3వేల కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు ల్యాప్స్ అయ్యే అవకాశం ఉండటంతో సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు పేర్కొన్నారు. HC తీర్పు అనంతరం MPTC, ZPTC ఎన్నికలకు వెళ్తామన్నారు.


