News June 17, 2024

జగిత్యాల: ఆస్తి తగాదాలతో కుమారుడి హత్య

image

ఆస్తి తగాదాలతో కుమారుడిని తండ్రి హత్య చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాలు.. కోరుట్ల మండలం మోహనరావుపేటకు చెందిన తండ్రి గంగరాజన్, కుమారుడు రాజేశ్(32) మధ్య ఆదివారం రాత్రి ఆస్తి విషయంలో వివాదం జరిగింది. ఈ క్రమంలో గొడవ మరింత పెరిగి గంగరాజన్ రాజేశ్‌ను కత్తితో దాడి చేశాడు. వెంటనే రాజేశ్‌ను HYD తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. గంగరాజన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Similar News

News October 27, 2025

KNR: NOV 3న అరుణాచలానికి ప్రత్యేక బస్సు

image

KNR నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు KNR 1 DM విజయమాధురి తెలిపారు. NOV 3న KNR బస్టాండ్ నుంచి సా.4 గంటలకు బయలుదేరి NOV 4న కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం తర్వాత అరుణాచలం చేరుకుంటుందన్నారు. గిరిప్రదక్షిణ, దర్శనమనంతరం NOV 5న అరుణాచలం నుంచి బయలుదేరి మరుసటి రోజు జోగులాంబ దర్శనం తర్వాత NOV 6న సాయంత్రం వరకు బస్సు KNRకు చేరుకుంటుందని చెప్పారు. వివరాలకు 9959225920ను సంప్రదించాలన్నారు.

News October 26, 2025

కరీంనగర్: రేపటి ప్రజావాణి రద్దు.. ఎందుకంటే..?

image

కరీంనగర్ కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణి నిర్వహించే ఆడిటోరియంలో మద్యం దుకాణాల టెండర్‌కు సంబంధించిన లాటరీ కార్యక్రమం ఏర్పాటు చేసినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఈ అంతరాయాన్ని గమనించి సహకరించాలని ఆమె కోరారు.

News October 26, 2025

కరీంనగర్ మహాసభకు ‘తరలిన శ్రీనివాసులు’

image

చొప్పదండి మండలం నుంచి శ్రీనివాస నామదేయ మిత్రులు ఆదివారం పెద్దసంఖ్యలో KNRలో జరుగుతున్న తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ వార్షికోత్సవ మహాసభకు తరలివెళ్లారు. కాగా, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు ఈ సభకు వస్తుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. వార్షికోత్సవ మహాసభ సందర్భంగా తలసేమియా బాధితులకు రక్తదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం భవిష్యత్ కార్యక్రమాలకు రూపకల్పన చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.