News March 24, 2025
జగిత్యాల: ఆ ప్రాంతంలో MLA ఉప ఎన్నికలు అనివార్యమేనా?

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. రేపు ఈ కేసును ధర్మాసనం విచారించనుంది. ఈ క్రమంలో జగిత్యాలలో BRS నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన సంజయ్ కుమార్పై అనర్హత వేటు పడుతుందా.. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. జగిత్యాలలో ఉప ఎన్నికలు జరుగుతాయా అని స్థానికంగా జోరుగా చర్చ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్?
Similar News
News December 26, 2025
మామిడిలో మంచి పూత కోసం ఏం చేయాలి?

మామిడి చెట్లలో అక్కడక్కడ పూత మొగ్గలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డిసెంబర్, JAN నెలల్లో రైతులు తీసుకునే చర్యలు మామిడి పూతను నిర్ణయిస్తాయి. ఈ సమయంలో పంటకు తేనెమంచు పురుగు, బూడిద తెగులు ముప్పు ఎక్కువ. వాటి నియంత్రణకు జాగ్రత్తలు తీసుకుంటూనే చెట్లలో సూక్ష్మపోషకాల లోపాన్ని గుర్తించి అవసరమైన మందులను నిపుణుల సూచనలతో పిచికారీ చేయాలి. మామిడిలో మంచి పూత కోసం ఏం చేయాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 26, 2025
వరుసగా రెండో ఏడాది.. భారత క్రికెటర్లకు నిరాశ!

దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారమైన ‘ఖేల్రత్న’ జాబితాలో రెండేళ్లుగా క్రికెటర్లకు చోటు దక్కట్లేదు. తాజాగా గగన్ నారంగ్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 24 మంది క్రీడాకారుల పేర్లను క్రీడా మంత్రిత్వశాఖకు పంపగా అందులో ఏ ఒక్క క్రికెటర్ లేరు. ఈ ఏడాది మెన్స్ క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ, ASIA కప్ గెలవగా.. ఉమెన్స్ టీమ్ తొలిసారి వన్డే WC సాధించింది. అయినా ఒక్కరిని కూడా ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
News December 26, 2025
అనకాపల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి

అనకాపల్లి మండలం కొత్తూరు జంక్షన్ వద్ద ఈనెల 24వ తేదీ రాత్రి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్సై శేషగిరిరావు తెలిపారు. కసింకోట మండలానికి చెందిన పప్పల జ్ఞానేశ్వరరావు (31) ద్విచక్ర వాహనంపై అనకాపల్లి వెళుతూ ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుడిని కేజీహెచ్ కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.


