News March 24, 2025
జగిత్యాల: ఆ ప్రాంతంలో MLA ఉప ఎన్నికలు అనివార్యమేనా?

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. రేపు ఈ కేసును ధర్మాసనం విచారించనుంది. ఈ క్రమంలో జగిత్యాలలో BRS నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన సంజయ్ కుమార్పై అనర్హత వేటు పడుతుందా.. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. జగిత్యాలలో ఉప ఎన్నికలు జరుగుతాయా అని స్థానికంగా జోరుగా చర్చ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్?
Similar News
News November 28, 2025
నేడే రాజధానిలో 15 బ్యాంకులకు శంకుస్థాపన

AP: రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు పడనుంది. దేశంలోని 15 ప్రముఖ బ్యాంకులు, బీమా సంస్థలు రాజధానిలో తమ ఆఫీసులు ఏర్పాటు చేసుకుంటున్నాయి. వీటికి ఈ ఉదయం 11.22గంటలకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, CM CBN చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. రూ.1,334 కోట్లతో నిర్మాణాలు చేపట్టనున్నారు. ఆయా బ్యాంకులు, బీమా సంస్థల ప్రతినిధులు, మంత్రులు, రాజధాని రైతులు హాజరుకానున్నారు.
News November 28, 2025
వనపర్తి: పంచాయతీ ఎన్నికల ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్ నంబర్

వనపర్తి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 08545-233525కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఆమె తెలియజేశారు.
News November 28, 2025
రాష్ట్రస్థాయి క్రికెట్లో ఉమ్మడి ఖమ్మం జట్టు రన్నరప్

సంగారెడ్డిలో 3 రోజులుగా జరిగిన SGF రాష్ట్ర స్థాయి అండర్-19 బాలికల క్రికెట్ టోర్నమెంట్లో ఉమ్మడి ఖమ్మం జట్టు అద్భుత ప్రదర్శనతో ద్వితీయ స్థానం(రన్నరప్) సాధించింది. ఫైనల్ మ్యాచ్లో ఖమ్మం-HYD జట్లు తలపడ్డాయి. ఆసక్తికరంగా సాగిన పోరులో చివరకు 6 పరుగుల స్వల్ప తేడాతో HYD జట్టు విజయం సాధించింది. ఖమ్మం జట్టు ప్రతిభావంతమైన ఆటతీరుతో రన్నరప్గా నిలవడంతో, జిల్లా క్రీడాకారులు, కోచ్లు అభినందనలు అందుకున్నారు.


