News March 24, 2025

జగిత్యాల: ఇంగ్లిష్ పరీక్షకు 8 మంది గైర్హాజరు

image

జగిత్యాల జిల్లాలో పదోతరగతి పబ్లిక్ పరీక్షలలో భాగంగా మూడోరోజు ఇంగ్లిష్ పేపర్ రెగ్యులర్ పరీక్షకు మొత్తం 11845 విద్యార్థులకు 11839 విద్యార్థులు హాజరయ్యారు. ఆరుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. రెగ్యులర్ విద్యార్థుల హాజరు శాతం 99.95% ఉండగా.. సప్లమెంటరీ విద్యార్థులకు సంబంధించిన పరీక్ష కేంద్రాలలో 27 విద్యార్థులకు 25 మంది విద్యార్థులు గైర్హజరయ్యారు. వీరి హాజరుశాతం 85.19%. ఉంది అని అధికారులు తెలిపారు.

Similar News

News December 4, 2025

VJA: భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు నజరానా

image

భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ప్రోత్సాహకంగా భారీ నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో జట్టుకు రూ.10 లక్షల చెక్కును కెప్టెన్ దీపికకు అందజేశారు. ఫైనల్‌లో కీలక పాత్ర పోషించిన పొంగి కరుణా కుమారికి రూ. 5 లక్షలు, జట్టు కోచ్ అజేయ్ కుమార్ రెడ్డికి రూ.1 లక్షను ఏసీఏ ప్రదానం చేసింది.

News December 4, 2025

ఖమ్మం నేతల ప్రస్థానం.. సర్పంచ్‌ నుంచే రాష్ట్ర రాజకీయాలకు!

image

నేటి రాజకీయాల్లో సర్పంచ్‌ పదవి అత్యంత కీలకమనడానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా చరిత్రే దీనికి నిదర్శనం. రాంరెడ్డి వెంకటరెడ్డి, వనమా వెంకటేశ్వరరావు వంటి సీనియర్‌ నేతలు మొదట సర్పంచ్‌లుగా గెలిచి, ఆ తర్వాత ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఎదిగారు. అలాగే, మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, కొండబాల కోటేశ్వరరావు, సున్నం రాజయ్య సైతం సర్పంచ్‌ నుంచే ఎమ్మెల్యేలుగా గెలుపొందడం ఈ పదవి ప్రాధాన్యతను తెలియజేస్తోంది.

News December 4, 2025

మూలపేట పొర్టు నిర్మాణంపై అప్‌డేట్

image

టెక్కలి నియోజకవర్గం మూలపేట పోర్టు నిర్మాణం జాప్యం అవుతోంది. దీని వ్యవధిని 2026 నవంబర్‌కు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు రూ. 2949.70 కోట్లతో విశ్వసముద్ర పోర్టు కాంట్రాక్ట్ సంస్థ పనులను 2023 ఏప్రిల్‌లో ప్రారంభించింది. కాంట్రాక్టర్ గడువు ఈ ఏడాది అక్టోబర్ 17తో ముగిసింది. పెండింగ్ పనుల దృష్ట్యా కట్టడాల కాలపరిమితిని పెంచుతూ తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.