News March 1, 2025

జగిత్యాల : ఇంటర్ పరీక్షలు సజావు నిర్వహించాలి: సీఎస్

image

జిల్లాలో ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమారి సూచించారు. శుక్రవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ బి. సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ బీఎస్ లతతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రశ్నపత్రాల తరలింపు పోలీస్ బందోబస్తు మధ్య నిర్వహించాలన్నారు. పరీక్ష కేంద్రంలోకి ఎవరికీ సెల్‌ఫోన్‌ను అనుమతించవద్దన్నారు.

Similar News

News October 30, 2025

నిజామాబాద్: వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం

image

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ శివారులో ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మరణించినట్లు పోలీసులు తెలిపారు. బాల్కొండ మండలం బోదెపల్లికి చెందిన సుధాకర్(48) తన TVS ఎక్సెల్ వాహనంపై ఆర్మూర్ వైపు వస్తుండగా ఉదయం 9.30 గంటల ప్రాంతంలో అతడి వాహనాన్ని పెర్కిట్ శివారులోని ఓ ఫంక్షన్ హాల్ ఎదుట గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుధాకర్ అక్కడికక్కడే మృతిచెందగా పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 30, 2025

కురిచేడు: వాగులో చిక్కుకున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు

image

పొంగిన వాగులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చిక్కుకుంది. ఈ ఘటన కురిచేడు మండలం వెంగాయపాలెం గ్రామం వద్ద చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెళ్తున్న సమయంలో గుండ్లకమ్మ వాగు ఒక్కసారిగా తన విశ్వరూపం చూపటంతో ఈ ఘటన జరిగింది. వెంటనే స్పందించిన పోలీసులు ట్రాక్టర్, తాళ్ల సహాయంతో బస్సును బయటికి తీసి ప్రయాణికులను కాపాడారు.

News October 30, 2025

SRSP UPDATE: 26 గేట్ల ద్వారా నీటి విడుదల

image

విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో SRSP నుంచి గురువారం ఉదయం 26 వరద గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి 1,09,654 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండగా ఔట్ ఫ్లోగా అంతే నీటిని దిగువకు వదులుతున్నారు. కాగా, ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 80.50 TMCలకు గాను తాజాగా 80.501 TMCల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.