News April 22, 2025

జగిత్యాల: ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 55.00 శాతం

image

ఇంటర్ ఫలితాల్లో జగిత్యాల జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్‌లో 7,073 మందికి 3.890 మంది పాసయ్యారు. 55.00-శాతం పాస్ పర్సంటేజీ వచ్చింది. సెకండ్ ఇయర్‌లో 6.173 మంది పరీక్షలు రాయగా 4.220 మంది పాసయ్యారు. 68.36 శాతం పాస్ పర్సంటేజీ వచ్చింది.

Similar News

News April 23, 2025

అమరావతి: ఒకప్పటి ధాన్యకటకం గురించి తెలుసా..?

image

అమరావతి ప్రాచీనంగా ధాన్యకటకం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. శాతవాహనుల్లో గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో(సా.శ. 1వ శతాబ్దం) ఈప్రాంతం బౌద్ధ, జైన మతాలకు ప్రముఖ కేంద్రంగా మారింది. బౌద్ధ విశ్వవిద్యాలయం, బౌద్ధరామాలు, స్థూపాలు అమరావతిని ప్రాచుర్యంలోకి తెచ్చాయి. శాతవాహన పాలకులు దీన్ని రాజధానిగా వాడారు. బౌద్ధుడి కాలచక్ర బోధనలకు కేంద్రంగా అమరావతి నిలిచింది. వజ్రయాన గ్రంథాల్లో అమరావతికి చారిత్రక ప్రామాణికత ఉంది.

News April 23, 2025

భానుడి ఉగ్రరూపం.. ఆ మండలాల్లోనే అత్యధికం

image

ఖమ్మం జిల్లాలో వాతావరణం నిప్పులకొలిమిని తలపిస్తుంది. మంగళవారం జిల్లాలోనే ఎర్రుపాలెంలో అత్యధికంగా 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అటు ముదిగొండ (బాణాపురం), నేలకొండపల్లిలో 42.8, కామేపల్లి (లింగాల), కారేపల్లి 42.7, వైరా 42.5, ఖమ్మం అర్బన్ 42.4, వేంసూరు, మధిర 42.3, తిరుమలాయపాలెం(బచ్చోడు) 42.1, రఘునాథపాలెం 41.5, బోనకల్, చింతకాని 41.4, కల్లూరు 39.8, సత్తుపల్లి 39.3 నమోదైంది.

News April 23, 2025

పహల్‌గామ్‌లో అనుమానాస్పద బైక్ గుర్తింపు

image

జమ్మూకశ్మీర్ పహల్‌గామ్ ఉగ్రదాడి ఘటన విచారణలో భద్రతా బలగాలు పురోగతి సాధించాయి. పహల్‌గామ్ సమీపంలో నంబర్ ప్లేట్ లేని బైక్‌ను గుర్తించాయి. టెర్రరిస్టులు దీన్ని ఉపయోగించినట్లు అనుమానిస్తున్నాయి. బైక్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నాయి. మరోవైపు ఘటనా స్థలానికి ఇవాళ ఎన్ఐఏ బృందాలు చేరుకోనున్నాయి.

error: Content is protected !!