News March 6, 2025
జగిత్యాల: ఈవీఎం గోదాం కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్న ఈవీఎం గోడౌన్ను ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ గురువారం తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రతకు సంబంధించి ప్రతి నెల తనిఖీలలో భాగంగా గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, ఆర్డిఓ మధుసూదన్, తాసిల్దార్ రామ్మోహన్ తదితరులు ఉన్నారు.
Similar News
News December 7, 2025
పులివెందుల: ‘పన్ను కట్టలేని స్థితిలో పార్టీ’

దేశ రాజకీయాలను శాసించిన పార్టీ మున్సిపాలిటీకి పన్ను కట్టలేని స్థితిలో ఉంది. పులివెందులలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి సంబంధించి 2006 నుంచి ఇప్పటివరకు కట్టాల్సిన రూ.3.50 లక్షల పన్ను బకాయిలు చెల్లించాలని ఇటీవల కాంగ్రెస్ నాయకులకు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. కాగా పన్ను బకాయిలపై కాంగ్రెస్ నాయకులు స్పందించలేదని తెలుస్తోంది. దీనిపై మున్సిపల్ అధికారులు ఏమి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
News December 7, 2025
సైనికుల సేవలు అమూల్యం: ఇలక్కియా

దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల సేవలు అమూల్యమని ఇన్ఛార్జ్ కలెక్టర్ ఇలక్కియా తెలిపారు. సాయుధ దళాల పతాక దినోత్సవం ఎన్టీఆర్ కలెక్టరేట్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలు, వికలాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ సైనికులకు ఈ నిధి ఉపయోగపడుతుందని చెప్పారు. జిల్లా ప్రజలు, వ్యాపారవేత్తలు, సంస్థలు విరాళాలు అందించాలని ఆమో పిలుపునిచ్చారు.
News December 7, 2025
వీటిని తింటే కళ్లద్దాల అవసరమే రాదు

ప్రస్తుత రోజుల్లో చిన్నారులను సైతం కంటి చూపు సమస్యలు వేధిస్తున్నాయి. పోషకాహార లోపమే దీనికి ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. రోజూ క్యారెట్, పాలకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలు, చిలకడదుంపలు తినిపిస్తే Vitamin A సమృద్ధిగా లభిస్తుంది. చేపలు, వాల్నట్స్, అవిసె గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు వల్ల కళ్ల ఆరోగ్యం మెరుగవుతుంది. క్యాప్సికం, బ్రోకలీ వంటి ఆహారాలు కూడా కంటి నరాలకు మేలు చేస్తాయి.


