News March 6, 2025
జగిత్యాల: ఈవీఎం గోదాం కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్న ఈవీఎం గోడౌన్ను ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ గురువారం తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రతకు సంబంధించి ప్రతి నెల తనిఖీలలో భాగంగా గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, ఆర్డిఓ మధుసూదన్, తాసిల్దార్ రామ్మోహన్ తదితరులు ఉన్నారు.
Similar News
News April 19, 2026
టాస్ గెలిచిన లక్నో

IPL: పంజాబ్ కింగ్స్తో జరగనున్న మ్యాచులో లక్నో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. చంఢీఘర్లోని ముల్లాన్పూర్లో ఈ మ్యాచ్ జరగనుంది.
పంజాబ్: ప్రభ్సిమ్రన్, ప్రియాన్ష్, శ్రేయస్(C), కనోలి, శశాంక్ సింగ్, వధేరా, స్టాయినిస్, యాన్సెన్, బార్ట్లెట్, అర్ష్దీప్, చాహల్.
LSG: మార్ష్, మార్క్రమ్, పంత్, బదోని, పూరన్, ముకుల్, షమీ, ఆవేశ్, సిద్దార్థ్, ప్రిన్స్, మోహ్సిన్.
News April 19, 2026
MNCL: ప్రశాంతంగా మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు

మంచిర్యాల జిల్లాలో తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. ఉదయం నిర్వహించిన 6వ తరగతి ప్రవేశ పరీక్షకు 1120 మంది విద్యార్థులకు గాను 989 మంది, 7వ తరగతికి 305 మంది విద్యార్థులకు 285 మంది, 8వ తరగతి 225 మందికి 203, 9వ తరగతికి 151 మందికి 142, పదవ తరగతికి 33 మంది విద్యార్థులకు 28 మంది హాజరైనట్లు డీఈవో యాదయ్య తెలిపారు.
News April 19, 2026
పుట్టగానే శిశువుకు ఫస్ట్ బర్త్ డే!

దక్షిణ కొరియాలో అప్పుడే పుట్టిన శిశువు వయసును ఏడాదిగా పరిగణించే వింత ఆచారం ఉండేది. గర్భస్థ కాలాన్ని కూడా లెక్కించడమే దీనికి కారణం. అలాగే ప్రతి JAN 1న అందరికీ వయసు పెరుగుతుంది. అంటే.. DEC 31న పుట్టిన బిడ్డకు మరుసటి రోజే రెండేళ్లు పూర్తవుతాయి. అయితే 2023 నుంచి ఈ పద్ధతిని అక్కడి ప్రభుత్వం మార్చింది. దీంతో అందరి వయసు తగ్గడం విశేషం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో(51/100)


