News January 16, 2025
జగిత్యాల: ఈ ఇందిరాభవన్ గురించి మీకు తెలుసా?

దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ నూతన కార్యాలయం ఇందిరా భవన్ ఈరోజు ప్రారంభించారు. అయితే జగిత్యాల జిల్లా కేంద్రంలో సైతం ఓ ఇందిరా భవన్ ఉంది. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇందిరాగాంధీపై విధేయతకు చిహ్నంగా తన నివాస గృహానికి ఇందిరాభవన్గా నామకరణం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ భవనంలోనే సాదాసీదాగా నిత్యం తన వద్దకు వచ్చే ప్రజలకు ఆయన అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు.
Similar News
News November 24, 2025
KNR: ‘ప్రజావాణి’ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో కరీంనగర్ నగరపాలక కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీఓ మహేశ్వర్, ఇతర అధికారులతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 352 దరఖాస్తులు వచ్చాయి. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.
News November 24, 2025
KNR: ‘ప్రజావాణి’ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో కరీంనగర్ నగరపాలక కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీఓ మహేశ్వర్, ఇతర అధికారులతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 352 దరఖాస్తులు వచ్చాయి. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.
News November 24, 2025
KNR: డిసెంబర్ 1 నుంచి 6 వరకు డి.ఎల్.ఇడి పరీక్షలు: డీఈఓ

కరీంనగర్ జిల్లాలోని డి.ఎల్.ఇడి. (D.El.Ed.) ప్రథమ సంవత్సరం పరీక్షలు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 వరకు నిర్వహించబడతాయని జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) ఎస్. మొండయ్య తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు రెండు పరీక్షా కేంద్రాల్లో జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను bse.telangana.gov.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని డీఈఓ సూచించారు.


