News March 6, 2025
జగిత్యాల: ఎక్కడి సమస్యలు అక్కడే..!

గ్రామాల్లో సర్పంచ్ల పదవీకాలం ముగిసి సంవత్సరం దాటింది. అప్పటి నుంచి జగిత్యాల జిల్లాలోని 385 గ్రామపంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. దీంతో గ్రామాల్లో సమస్యలు తిష్ఠవేశాయి. గ్రామపంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో ప్రభుత్వాలు నిధులు విడుదల చేయడం లేదు. ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
Similar News
News March 19, 2025
పెద్దేముల్ మండలంలో తెల్లవారుజామున హత్య

పెద్దేముల్ మండలంలోని హన్మాపూర్ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున హత్య జరిగింది. గ్రామానికి చెందిన బక్కని వెంకటేష్ను హత్య చేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హన్మాపూర్ వరుస హత్యలు కలవర పెడుతున్నాయి.
News March 19, 2025
హిందూపురం వ్యక్తి దారుణ హత్య

శ్రీ సత్యసాయి జిల్లా మలుగూరు సమీపంలో హిందూపురానికి చెందిన సద్దాం(35) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరగగా.. బుధవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. హిందూపురం రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News March 19, 2025
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా డా.నందకుమార్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠాత్మకమైన కాళోజి నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా డాక్టర్ నందకుమార్ రెడ్డి నియమిస్తూ కొద్ది సేపటి క్రితం యూనివర్సిటీ ఛాన్సలర్, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో నందకుమార్ రెడ్డి మూడేళ్లు కొనసాగనున్నారు.