News January 23, 2025

జగిత్యాల: ఎన్నిసార్లు దరఖాస్తు చేయాలంటూ ఆందోళన 

image

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంట గ్రామంలో ప్రజాపాలన ప్రత్యేక గ్రామసభ గురువారం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్లు పేదలకు ఇవ్వాలని.. జాబితాలో పేదల పేర్లు లేవంటూ గ్రామస్థులు అధికారులను నిలదీశారు. ఇంకెప్పుడూ పేదలకు ఇళ్లు మంజూరు చేస్తారని, ఎన్నిసార్లు దరఖాస్తు చేయాలని అధికారులపై గ్రామస్థులు మండిపడ్డారు. గ్రామ సభలో కాసేపు గందరగోళం నెలకొంది. అధికారుల సమాధానంపై గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Similar News

News December 4, 2025

రంగారెడ్డి: తొలి విడతలో ఆరుగురు సర్పంచ్‌లు ఏకగ్రీవం

image

రంగారెడ్డి జిల్లాలో తొలి విడతలో 174 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఆరుగురు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 168 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 530 మంది సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. 1,530 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 190 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 1,340 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా 3,379 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

News December 4, 2025

ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేయాలి: కలెక్టర్

image

షెడ్యూల్ ప్రకారం అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం అమలాపురం కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రబీ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులకు అవసరమైన యూరియా, పొటాష్ తదితర రసాయన ఎరువులను అందుబాటులో ఉంచాలని సూచించారు. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అదనపు నిల్వలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News December 4, 2025

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి: తిరుపతి కలెక్టర్

image

APSSDC ఆధ్వర్యంలో 6వ తేదీ గూడూరు పట్టణంలోని DRW డిగ్రీ కళాశాల జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్యభివృద్ధి శాఖ అధికారి లోకనాథం పేర్కొన్నారు. గురువారం తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 15 కంపెనీల ప్రతినిధులు వస్తారని, 700 ఖాళీలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు.