News January 23, 2025

జగిత్యాల: ఎన్నిసార్లు దరఖాస్తు చేయాలంటూ ఆందోళన 

image

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంట గ్రామంలో ప్రజాపాలన ప్రత్యేక గ్రామసభ గురువారం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్లు పేదలకు ఇవ్వాలని.. జాబితాలో పేదల పేర్లు లేవంటూ గ్రామస్థులు అధికారులను నిలదీశారు. ఇంకెప్పుడూ పేదలకు ఇళ్లు మంజూరు చేస్తారని, ఎన్నిసార్లు దరఖాస్తు చేయాలని అధికారులపై గ్రామస్థులు మండిపడ్డారు. గ్రామ సభలో కాసేపు గందరగోళం నెలకొంది. అధికారుల సమాధానంపై గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Similar News

News February 17, 2025

HYDలో నెహ్రూ జూ పార్క్ వద్ద అధిక కాలుష్యం..!

image

HYD నగరం పరిధిలో నెహ్రూ జూపార్క్ ప్రాంతం అత్యంత కాలుష్యమైన ప్రాంతమని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపింది. 40 రోజుల సగటు వాయు నాణ్యత 150గా నమోదైందని పేర్కొంది. జనవరి 20వ తేదీన అత్యధికంగా 200 నమోదైందని వెల్లడించింది. అతి సూక్ష్మ ధూళి కణాలు అధిక మోతాదులో విడుదవుతున్నట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపింది.

News February 17, 2025

ఢిల్లీ సీఎం ఎంపిక నేడే?

image

ఢిల్లీ కొత్త సీఎం ఎవరన్న సస్పెన్స్‌‌కు నేడు తెరపడే ఛాన్స్ ఉంది. ఈరోజు రాజధానిలో జరిగే సమావేశంలో సీఎం పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఆ పేరుపై హైకమాండ్ ఇప్పటికే స్పష్టతతో ఉన్నప్పటికీ బయటికి పొక్కకుండా జాగ్రత్త పడుతోంది. కేజ్రీవాల్‌పై విజయం సాధించిన పర్వేశ్ వర్మతో పాటు మాజీ విజేందర్ గుప్తా, సతీశ్ ఉపాధ్యాయ, ఆశిష్ సూద్, జితేంద్ర మహాజన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

News February 17, 2025

మెదక్: కలుసుకున్న 1972 ఇంటర్ మొదటి బ్యాచ్

image

మెదక్ పట్టణంలో ఇంటర్మీడియట్ మొదటి బ్యాచ్(1972) చదువుకున్న వారంతా ఆదివారం కలుసుకున్నారు. ఇందులో కొందరు చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు. సరోజిని దేవి విద్యాసంస్థల ఛైర్మన్ ఆర్. జనార్ధన్ రెడ్డి, రిటైర్డ్ TSPCDL డైరెక్టర్ తౌట శ్రీనివాస్, వివి సిల్క్స్ వనపర్తి వెంకటేశం, అల్లెంకి సుదర్శనం, వెంకటేశం, మేడిశెట్టి కుమార్, STO జగన్నాథం, డా. రామరాజు, క్రిష్ణయ్య తదితరులున్నారు. వారంత ఆప్యాయంగా మాట్లాడుకున్నారు.

error: Content is protected !!