News March 29, 2024
జగిత్యాల ఎమ్మెల్యేకు పితృ వియోగం

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తండ్రి, సీనియర్ న్యాయవాది మాకునూరి హన్మంతరావు కొద్దిసేపటి క్రితం మరణించారు. పార్థివదేహాన్ని హౌసింగ్ బోర్డు కాలనీలో గల ఎమ్మెల్యే గృహంలో ఉంచారు. కాగా, ఈరోజు రాత్రి 8 గంటలకు మోతే శ్మశానవాటిక(శంకర్ ఘాట్)లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను పలువురు ప్రముఖులు పరామర్శించారు.
Similar News
News October 17, 2025
గన్నేరువరం: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

ప్రజలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా సివిల్ సప్లై అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు మండలంలోని గుండ్లపల్లి ఎక్స్ రోడ్డు వద్ద సివిల్ సప్లై అధికారుల పట్టుకున్నట్లు ఎస్సై వివరించారు. బొలెరోలో 50 క్వింటాళ్ల రేషన్ బియ్యం లభ్యమయ్యాయి. సివిల్ సప్లై అధికారి ఫిర్యాదు మేరకు బొజ్జ రాజు పైన కేసు నమోదు చేశారు.
News October 17, 2025
గంగాధర: పిల్లలలో లోపపోషణ నివారణకు పటిష్ట చర్యలు

పిల్లలలో లోపపోషణ నివారణకు ఐసీడీఎస్, ఆరోగ్య శాఖ ద్వారా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గంగాధర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ మాసం, శుక్రవారం సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. శుక్రవారం సభలో భాగంగా ప్రతి శుక్రవారం ప్రభుత్వ పాఠశాల, ఆరోగ్య కేంద్రం అంగన్వాడీ సేవలను పర్యవేక్షిస్తామన్నారు.
News October 17, 2025
KNR: ‘బంద్ ఫర్ జస్టిస్’కు ఏఐఎస్ఎఫ్ మద్దతు

‘బంద్ ఫర్ జస్టిస్’ తెలంగాణ బంద్కు తమ సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఏఐఎస్ఎఫ్ (AISF) రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి కరీంనగర్లో ప్రకటించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే, వెంటనే గవర్నర్, రాష్ట్రపతి చేత ఆమోదింపజేసి 9వ షెడ్యూల్లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ బంద్ ద్వారానైనా బీసీ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని ఆయన కోరారు.