News April 5, 2025
జగిత్యాల: ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి ప్రత్యేక దృష్టి సారించాలి: ఛైర్మన్

ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పూర్తిగా వారికే కేటాయించాలని, నిధులు పక్కదారి పట్టకుండా చూడాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలన్నారు. వసతి గృహాల్లో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.
Similar News
News November 21, 2025
ADB: 15ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

అత్యాచారం కేసులో ముగ్గురిని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. మావల పీఎస్ పరిధిలోని ఒక కాలనీకి చెందిన 15 సంవత్సరాల బాలికను మభ్యపెట్టి గత కొన్నాళ్లుగా మహారాష్ట్రకు చెందిన నిందితులు యోగేష్ జాదవ్, సూరజ్ జాదవ్, ఆదిలాబాద్కు చెందిన జాదవ్ నవీన్ అత్యాచారం చేస్తున్నారన్నారు. బుధవారం సైతం ఒక ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారన్నారు. ఈ మేరకు నిందితులపై పోక్సో కేసు నమోదు చేశామన్నారు.
News November 21, 2025
ప.గో: 70 మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ కేంద్రాలుగా మార్పు

పశ్చిమగోదావరి జిల్లాలో 70 మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మారనున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి డి. లక్ష్మీ తెలిపారు. వీటిలో పనిచేస్తున్న 10వ తరగతి పాసైన 59 మందికి మెయిన్ కార్యకర్తలుగా పదోన్నతి లభిస్తుందని ఆమె అన్నారు. దీంతో వారి గౌరవ వేతనం రూ.7 వేల నుంచి రూ.11,500 లకు పెరుగుతుందని లక్ష్మీ తెలియజేశారు.
News November 21, 2025
ప.గో: 70 మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ కేంద్రాలుగా మార్పు

పశ్చిమగోదావరి జిల్లాలో 70 మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మారనున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి డి. లక్ష్మీ తెలిపారు. వీటిలో పనిచేస్తున్న 10వ తరగతి పాసైన 59 మందికి మెయిన్ కార్యకర్తలుగా పదోన్నతి లభిస్తుందని ఆమె అన్నారు. దీంతో వారి గౌరవ వేతనం రూ.7 వేల నుంచి రూ.11,500 లకు పెరుగుతుందని లక్ష్మీ తెలియజేశారు.


