News March 29, 2024

జగిత్యాల: ఒంటిపై పెట్రోల్ పోసుకుని సూసైడ్

image

ఒంటిపై పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం..జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన కళ్యాణ్ అనే యువకుడు గురువారం రాత్రి ఇంట్లో నుంచి వెళ్లాడు. గ్రామ శివారులోని పాడుబడ్డ కోళ్ల ఫారంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రాయికల్ పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 22, 2025

KNR: పప్పు ధాన్యాల సాగుపై రైతుల అనాసక్తి!

image

ఉమ్మడి KNR జిల్లాలో పప్పు ధాన్యాల సాగు తగ్గిపోతుంది. మినప, పెసర, కంది, పల్లి, ఇతర పంటలను సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు. వేలాది ఎకరాల్లో సాగయ్యే పప్పు ధాన్యాల పంట నేడు గణనీయంగా తగ్గిపోయింది. యాసంగి సాగు తరువాత మినప, పెసర పంటలు వేయడం వల్ల భూసారం పెరగడంతో పాటు రైతులకు ఆదాయం కూడా వస్తుంది. అధికారులు చర్యలు తీసుకోని రైతులకు అవగాహన కల్పించాలి. లేదంటే ఈ పంటలు కనుమరుగు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

News April 22, 2025

గుంపుల- తనుగుల వంతెన పై రోడ్డు ప్రమాదం యువకుడు మృతి

image

ఓదెల(M) గుంపుల, జమ్మికుంట(M) తనుగుల మధ్య ఉన్న వంతెనపై రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. JMKT(M) వావిలాలకు చెందిన నెల్లి వంశీ(25)కి ఓదెల(M) గూడెంకు చెందిన అర్చితతో ఇటీవల వివాహమైంది. కళ్యాణ లక్ష్మి పత్రాలపై సంతకం చేసేందుకు ఉదయం గూడెం గ్రామానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో గుంపుల వంతెన పై ఎదురుగా వస్తున్న కారు బైక్ ను ఢీ కొట్టింది. వంశీ మృతి చెందగా అర్చిత ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.

News April 21, 2025

కరీంనగర్: ధరణిలో పొరపాట్ల సవరణ అధికారం కలెక్టర్‌కే : పమేలా సత్పతి

image

ధరణిలో పొరపాట్లను సవరించడానికి కలెక్టర్ మినహా ఏ అధికారికి అవకాశం లేదని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. సోమవారం గంగాధరలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్‌లో భూభారతి, ఆర్వోఆర్ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తహశీల్దార్ స్థాయిలో పరిష్కారమయ్యే చిన్న సమస్యలు వేలసంఖ్యలో పేరుకుపోయాయన్నారు. భూభారతి చట్టం ద్వారా ప్రభుత్వం అన్ని సమస్యలు పరిష్కరిస్తుందన్నారు.

error: Content is protected !!