News August 14, 2024

జగిత్యాల: ఒకే వేదికపై MLA, MLC, MP

image

జగిత్యాల పట్టణంలోని 46వ వార్డులో నేడు ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య భవనాన్ని జగిత్యాల MLA డా.సంజయ్ కుమార్, MLC జీవన్ రెడ్డి, MP ధర్మపురి అరవింద్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఒకే వేదికపై వేర్వేరు పార్టీల MLA, MLC, MLC పాల్గొన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి తదితరులు ఉన్నారు.

Similar News

News October 16, 2025

KNR: సానుభూతితో కాదు.. పట్టుదల, ప్రతిభతో విజయం సాధించాలి

image

కరీంనగర్ జిల్లా కేంద్రంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బాలికలు సానుభూతితో కాకుండా పట్టుదల, నైపుణ్యంతో విజయం సాధించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమం బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించారు. కష్టపడి చదివితేనే విజయం సాధించవచ్చన్నారు. బాలికలు వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించి ధైర్యంగా ముందడుగు వేయాలని కలెక్టర్ కోరారు.

News October 16, 2025

KNR: వ్యాధితో తల్లి.. గుండెపోటుతో తండ్రి దూరం..!

image

తల్లిదండ్రులు లేని అనాథగా మిగిలాడు చొప్పదండి మండలం రాగంపేటకు చెందిన దీకొండ స్వాద్విన్ కుమార్. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న బాలుడి తల్లి మూడేళ్ల క్రితం ఊపిరితిత్తుల వ్యాధితో మరణించగా తండ్రి ఆదివారం గుండెపోటుతో దూరమయ్యాడు. ఈ క్రమంలో బాలుడి దయనీయ స్థితిని చూసిన రాగంపేట గ్రామస్థులు కంటతడి పెడుతూ.. ప్రభుత్వం, స్వచ్ఛంద సేవా సంస్థలు అతడిని చేరదీసి చదివించాలని కోరుతున్నారు.

News October 16, 2025

KNR: 20 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు

image

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు. రాష్ట్ర DGP ఆదేశాల మేరకు విధి నిర్వహణలో ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలను, త్యాగాలను స్మరించుకుంటూ ఈనెల 20 నుంచి 31 వరకు ‘పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల’ను ఘనంగా నిర్వహించనున్నట్లు సీపీ పేర్కొన్నారు.