News February 27, 2025
జగిత్యాల: ఓటు వేసిన కలెక్టర్ దంపతులు

జగిత్యాల కేంద్రంలోని పోలింగ్ స్టేషన్ నం.188లో జిల్లా కలెక్టర్ శ్రీ సత్యప్రసాద్ దంపతులు కలిసి ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
Similar News
News December 9, 2025
‘ఐదుగురు, అంతకంటే ఎక్కువమంది గుమికూడొద్దు’

కరీంనగర్ తొలి దశ గ్రామపంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు CP గౌష్ ఆలం తెలిపారు. రూరల్ డివిజన్లోని ఐదు మండలాల్లో BNSS సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధించామన్నారు. ఈ ఉత్తర్వులు ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి DEC 11 రాత్రి 11:59 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమికూడటంపై పూర్తి నిషేధం అమలులో ఉంటుందన్నారు. ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవన్నారు.
News December 9, 2025
పార్వతీపురం: ‘క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమం’

పార్వతీపురం జిల్లాలోని పాఠశాల నుంచి కళాశాల స్థాయిలో గల క్రీడాకారులను, ప్రతిభావంతులను గుర్తించేందుకు ప్రత్యేక క్రీడా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్ది పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో సమావేశం ఏర్పాటు చేశారు. మన్యం జిల్లాలో క్రీడాకారులకు, ప్రతిభ ఉన్నవారికి కొదవలేదన్నారు. కళాకారులను ప్రోత్సహించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టమన్నారు.
News December 9, 2025
ఆ ఘటన నన్ను కలవరపెడుతోంది: తిరుపతి కలెక్టర్

కేవీబీపురం మండలం కళత్తూరులో జరిగిన విధ్వంసాన్ని తన సర్వీసులో ఎన్నడూ చూడలేదని తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. నిద్రలో కూడా ఆ ఘటన తనన కలవరపెడుతోందని చెప్పారు. పుత్తూరు డీఎస్పీ, రూరల్ సీఐ, కేవీబీపురం ఎస్ఐలు పెద్ద ప్రమాదం నుంచి ప్రజలను అప్రమత్తం చేశారని కొనియాడారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు అధికారుల బాగా పనిచేశారన్నారు. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.


