News December 1, 2024
జగిత్యాల: కన్నతల్లిని శ్మశానంలో వదిలిన కుమారులకు కౌన్సెలింగ్

జగిత్యాల జిల్లాలో కన్నతల్లిని శ్మశానంలో వదిలిన కుమారులకు ఆర్డీఓ మధుసూదన్ కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు పోలీసులు కుమారులతో సమ్మతి పత్రాలు రాయించి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలు ఆలకొండ రాజవ్వను ఆమె కుమారులు తమ ఇంటికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్, సఖీ అడ్మిన్ లావణ్య, ఫీల్డ్ ఆఫీసర్ కొండయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News November 16, 2025
కరీంనగర్: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, వీణవంక, జమ్మికుంట, మానకొండూరు, తిమ్మాపూర్ మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <
News November 16, 2025
కరీంనగర్: ఓటరు జాబితా సవరణపై సీఈఓ సమీక్ష

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సి. సుదర్శన్ రెడ్డి తెలంగాణలోని అన్ని ఈఆర్ఓలు, ఏఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటరు జాబితా ప్రత్యేక తీవ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం పురోగతిని, పెండింగ్లో ఉన్న ఎన్నికల సంబంధిత అంశాలను ఆయన సమీక్షించారు. ఈ కాన్ఫరెన్స్లో కరీంనగర్ కలెక్టరేట్ నుండి అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ పాల్గొన్నారు.
News November 16, 2025
కేశవపట్నం పీఎస్లో సీపీ గౌస్ ఆలం ఆకస్మిక తనిఖీ

కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం శనివారం కేశవపట్నం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఠాణా పనితీరు, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిని, వాటికి సంబంధించిన కేసు డైరీలను పరిశీలించారు. దర్యాప్తు వేగవంతం చేయాల్సిన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్న అనంతరం, ఠాణా అధికారి ఎస్సై శేఖర్కు సీపీ కీలక ఆదేశాలు జారీ చేశారు.


