News February 5, 2025

జగిత్యాల: కానిస్టేబుల్ నుంచి ఎస్ఐగా

image

మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ శ్వేత మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, 2018లో సిరిసిల్ల జిల్లాలో పోలీసు కానిస్టేబుల్‌గా జీవితం మొదలు పెట్టారు. అనంతరం 2020లో జగిత్యాల జిల్లాలోని పెగడపల్లిలో ఎస్ఐగా పనిచేశారు. అనంతరం కథలాపూర్, వెల్గటూర్, కోరుట్లలో కూడా పనిచేశారు. ప్రస్తుతం డీసీఆర్బీ ఎస్ఐగా ఉన్నారు. ఆమె మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News October 29, 2025

కోస్గి: డయల్ యువర్ డీఎం సద్వినియోగం చేసుకోవాలి

image

కోస్గి, నారాయణపేట డిపోల పరిధిలోని ప్రజలు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ లావణ్య బుధవారం ప్రకటనలో అన్నారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రజలు, ప్రయాణికులు సంస్థకు సంబంధించిన సమస్యలు, సలహాలు, సూచనలు ఇవ్వాలని చెప్పారు. 7382826293 నంబర్‌కు ఫోన్ చేసి చెప్పాలని కోరారు.

News October 29, 2025

జగిత్యాల: భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ సూచనలు

image

తుఫాన్ వల్ల జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున విద్యుత్ శాఖ SE బి.సుదర్శనం పలు సూచనలు తెలిపారు. వర్షం పడుతున్నప్పుడు తడి ప్రదేశాల్లో, తడిగా ఉన్న చేతులతో స్విచ్‌లు, మీటర్లు, ప్లగ్‌లు లేదా వైర్లు తాకకూడదన్నారు. తెగిపోయిన విద్యుత్ తీగలు కనిపించినప్పుడు దగ్గరికి వెళ్లకుండా, వెంటనే లైన్‌మెన్‌కి లేదా 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.

News October 29, 2025

ఇక స్పామ్ కాల్స్‌‌కు చెక్.. TRAI నిర్ణయం!

image

ఇన్‌కమింగ్ కాల్స్‌ విషయంలో కీలక మార్పు చోటుచేసుకోనుంది. కాలర్ పేరు రిసీవర్ ఫోన్‌లో ఇకపై డిఫాల్ట్‌గా డిస్‌ప్లే కానుంది. ఈ మేరకు టెలికం శాఖ ప్రపోజల్‌కు TRAI ఆమోదం తెలిపింది. SIM తీసుకునేటప్పుడు ఇచ్చిన వివరాలను ‘కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్’ ఫీచర్ ద్వారా ప్రదర్శిస్తారు. ఇది అందుబాటులోకొస్తే TrueCaller వంటి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం ఉండదు. స్పామ్ కాల్స్‌ను అరికట్టడంలో ఇది ఉపయోగపడుతుందని TRAI చెప్పింది.