News February 5, 2025

జగిత్యాల: కానిస్టేబుల్ నుంచి ఎస్ఐగా

image

మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ శ్వేత మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, 2018లో సిరిసిల్ల జిల్లాలో పోలీసు కానిస్టేబుల్‌గా జీవితం మొదలు పెట్టారు. అనంతరం 2020లో జగిత్యాల జిల్లాలోని పెగడపల్లిలో ఎస్ఐగా పనిచేశారు. అనంతరం కథలాపూర్, వెల్గటూర్, కోరుట్లలో కూడా పనిచేశారు. ప్రస్తుతం డీసీఆర్బీ ఎస్ఐగా ఉన్నారు. ఆమె మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News December 3, 2025

MBNR: పీయూలో ‘ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్’ కార్యక్రమం

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు విశ్వవిద్యాలయంలోని ఫార్మసీ ఆడిటోరియంలో ఈ నెల 6న నిర్వహించబోయే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ (ఐపీఆర్) కార్యక్రమం కరపత్రాన్ని వీసీ ప్రొ. జి.ఎన్. శ్రీనివాస్, రిజిస్ట్రార్ పి. రమేష్ బాబు బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, తెలంగాణ సైన్స్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్‌తో కలిసి నిర్వహించనున్నారు.

News December 3, 2025

MBNR: పీయూలో డిజిటల్ సేవలకు ‘సైబర్ హైట్స్’తో ఎంఓయూ

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా విద్యార్థులకు అందించే డిజిటల్ సేవలను మరింత మెరుగుపర్చడానికి పాలమూరు విశ్వవిద్యాలయం బుధవారం సైబర్ హైట్స్ సాఫ్ట్‌వేర్ సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంఓ‌యూ) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఎంతోమంది విద్యార్థులు లాభపడతారని వీసీ ప్రొ.జి‌ఎన్. శ్రీనివాస్ తెలిపారు. రిజిస్ట్రార్ ప్రొ. పి. రమేశ్ బాబు, మేనేజింగ్ డైరెక్టర్ బి. సదానందం తదితరులు పాల్గొన్నారు.

News December 3, 2025

GHMC బోర్డులు పెట్టండి: కమిషనర్

image

GHMCలో 27 పురపాలికల విలీనానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ పత్రంలో GHMC కమిషనర్ కర్ణన్, డిప్యూటీ కమిషనర్లకు పలు బాధ్యతలు అప్పగించారు. GHMC బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేకాక మినిట్ బుక్ సీజింగ్, ఉద్యోగుల సంఖ్య, ప్రాపర్టీస్ వివరాలు, గత మూడు సంవత్సరాల్లో జారీ చేసిన బిల్డింగ్, లేఅవుట్ పర్మిషన్లు, వర్క్, మెటీరియల్ బిల్స్ డేటా సైతం ప్రిపేర్ చేయాలన్నారు.