News February 16, 2025

జగిత్యాల: కుంభమేళా వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

image

మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో JGTL(D) ధర్మపురికి చెందిన వెంగళ ప్రమీల చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందారు. 10 రోజులక్రితం కుటుంబసభ్యులతో కలిసి 2 కార్లలో కుంభమేళాకు వెళ్లి వస్తుండగా గురువారం ఒక కారుకు ప్రమాదం జరిగింది. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ప్రమీల మృతిచెందింది. ప్రమీల గోదావరి నది తీరాన కొబ్బరికాయలు అమ్ముతూ జీవనం సాగిస్తుంది. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 28, 2025

NZB: GPఎన్నికలు.. సిబ్బందికి సీపీ సూచనలు

image

గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించేందుకు పోలీసు సిబ్బందికి నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య సెట్ కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు. ఎన్నికల భద్రత, శాంతి భద్రతా చర్యలు, పర్యవేక్షణకు సంబంధించిన సలహాలు ఇచ్చారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడడం ప్రజల భద్రత అని శాంతి భద్రతల పరిరక్షణ పోలీస్ బాధ్యత అని పేర్కొన్నారు.

News November 28, 2025

సూర్యాపేట జిల్లా గ్రామ ఓటర్ల లెక్క

image

సూర్యాపేట జిల్లాలో గ్రామ ఓటర్ల లెక్క తేలింది. జిల్లా వ్యాప్తంగా 486 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కాగా గ్రామ ఓటర్లు ఉన్నట్లు 6,94,815 ఎన్నికల సంఘం ప్రకటించింది. గరిడేపల్లి మండలంలో అత్యధికంగా 46,796 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా తిరుమలగిరి మండలంలో 17,799 మంది ఓటర్లు ఉన్నారు. ఇతరులు 22 మంది ఉన్నారు. మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంది. ఈ తుది జాబితాలోనే జిల్లాలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు.

News November 28, 2025

జనగామ: ఏకగ్రీవం వైపు సీనియర్.. పోటీ వైపు జూనియర్!

image

జనగామ జిల్లాలోని ఆయా గ్రామాల్లో పలు పార్టీల నేతలు ఏకగ్రీవం వైపు మొగ్గు చూపుతున్నారు. సీనియర్, జూనియర్ అని తేడా లేకుండా.. ఏకగ్రీవం చేస్తే గ్రామానికి పనులు చేస్తామంటూ స్వంతంగా మేనిఫెస్టో తయారు చేసి పలు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఏదేమైనా ఏకగ్రీవానికి చోటు ఇవ్వం అన్నట్లుగా యువ రాజకీయ నాయకులు పావులు కదుపుతున్నారు. ఏదేమైనా గ్రామాన్ని అభివృద్ధి చేసే వాళ్లు కావాలని ప్రజలు అంటున్నారు.