News March 1, 2025

జగిత్యాల: కుక్కల దాడిలో మూడేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు

image

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన కందరి శ్రీయాన్స్ అనే మూడేళ్ల బాలుడిపై కుక్కలు దాడిచేయడంతో తీవ్రగాయాలైనట్లు గ్రామస్థులు తెలిపారు. బాలుడు శుక్రవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటుండగా.. కుక్కలు దాడి చేసి మెడపై గాయపరిచాయి. బాలుడిని చికిత్స నిమిత్తం కరీంనగర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. గ్రామంలో కుక్కల బెడదను నివారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Similar News

News December 6, 2025

సెమీస్‌లో పాలమూరు అండర్-14 క్రికెట్ జట్టు

image

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భద్రాచలంలో జరుగుతున్న అండర్-14 క్రికెట్ పోటీల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. పాలమూరు జట్టు వరంగల్‌, అదిలాబాద్‌, మెదక్‌ జట్లపై వరుస విజయాలు సాధించినట్లు కోచ్‌ సురేశ్ తెలిపారు. జిల్లా జట్టు సెమీస్‌ చేరడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తూ, రాష్ట్రస్థాయిలో విజేతగా నిలవాలని ఆకాంక్షించారు.

News December 6, 2025

భద్రాద్రి జోన్ పరిధిలో 22 మందికి ఏఎస్సైలుగా పదోన్నతులు

image

భద్రాద్రి జోన్ పరిధిలోని 22 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్సైగా పదోన్నతి కల్పిస్తూ ఇన్‌ఛార్జ్ రేంజ్ డీఐజీ సన్‌ప్రీత్ సింగ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్, ఖమ్మం కమిషనరేట్లతో పాటు మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న వారికి ఈ పదోన్నతి లభించింది. ఈ మేరకు పదోన్నతి పొందిన వారిని జోన్ పరిధిలో వివిధ జిల్లాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

News December 6, 2025

ఎన్నికల కోడ్ తప్పనిసరిగా అమలు చేయాలి: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు ఎన్నికల సంఘం నియమాలను తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఆయన రిటర్నింగ్ అధికారులు, ఆర్డీవోలు, ఎంపీడీవోలతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి అలసత్వం వహించకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.