News April 24, 2024
జగిత్యాల: కెనాల్ వద్ద యువకుడి మృతదేహం

జగిత్యాల్ రూరల్ మండలంలోని ధరూర్, అంతర్గామ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ గట్టు వద్ద మంగళవారం గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతదేహం సగం కాలినట్లు ఉందని, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
Similar News
News January 9, 2026
KNR: ‘యూరియా నిల్వలు పుష్కలం..: ఆందోళన వద్దు’

కరీంనగర్ జిల్లాలో ఎరువుల కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. గత పది రోజుల్లోనే వివిధ సొసైటీల ద్వారా 6,513 మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రస్తుతం జిల్లాలో మరో 1,833 మెట్రిక్ టన్నుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. అవసరానికి తగినట్లుగా ఎరువులను తెప్పిస్తున్నామని, రైతులు తమ అవసరానికి మించి కొనుగోలు చేసి నిల్వ చేసుకోవద్దని సూచించారు.
News January 8, 2026
పర్లపల్లి: ‘పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి’

తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ ప్రీప్రైమరీ పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. తిమ్మాపూర్ మండలం పర్లపల్లిలోని ప్రభుత్వ ప్రీప్రైమరీ పాఠశాలను గురువారం ఆమె సందర్శించి, ఉచిత యూనిఫాంలు, పుస్తకాలు, స్టేషనరీని అందజేశారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, ప్రత్యేక సిలబస్తో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, ప్రస్తుతం జిల్లాలో 33 ప్రీప్రైమరీ పాఠశాలలు పనిచేస్తున్నాయని తెలిపారు.
News January 8, 2026
KNR: బ్యాంకుల భద్రతపై సీపీ గౌష్ ఆలం సమీక్ష

బ్యాంకులు, ఏటీఎంల వద్ద భద్రతను పటిష్టం చేయాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశించారు. బ్యాంక్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఆర్బీఐ నిబంధనల ప్రకారం హై-క్వాలిటీ సీసీ కెమెరాలు, పానిక్ బటన్లు, బర్గ్లర్ అలారమ్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నగదు తరలింపుపై పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని, సైబర్ మోసాలపై ఖాతాదారులకు అవగాహన కల్పించాలని సూచించారు.


