News February 4, 2025
జగిత్యాల: గురుకులాలలో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పొడిగింపు

తెలంగాణ ప్రభుత్వం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025-26 కు గాను అన్ని గురుకులాలలో 5 నుంచి 9 తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడిగించిందని జగిత్యాల జిల్లా సమన్వయ, నోడల్ అధికారి వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. ఈనెల 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రవేశ పరీక్షలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు ఉంటాయన్నారు.
Similar News
News March 11, 2026
20 నెలల్లో సూపర్ సిక్స్ సూపర్ హిట్: CBN

AP: 20 నెలల్లో సూపర్ సిక్స్ను సూపర్ హిట్ చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో కలెక్టర్ల సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘సూపర్ సిక్స్తో పాటు ఇతర పథకాలూ అమలు చేశాం. ఎక్కడా చిన్న తప్పు లేకుండా ముందుకెళ్తున్నాం. ఉగాది కానుకగా అన్నదాత సుఖీభవ, 2.50 లక్షల గృహప్రవేశాలు చేయిస్తున్నాం. అభివృద్ధి చేయాలంటే అనేక అవకాశాలు ఉన్నాయి. ఫర్వాలేదు అనే ఉదాసీనత ఉంటే ముందుకు వెళ్లలేం’ అని తెలిపారు.
News March 11, 2026
పెదకాకాని మర్డర్ కేసు ఛేదించిన GRP పోలీసులు

పెదకాకాని రైల్వే స్టేషన్లో మార్చి 4న జరిగిన హత్య కేసును గుంటూరు GRP పోలీసులు, RPF సిబ్బంది ఛేదించారు. మృతుడు పరమడం అనీశ్ బ్లేడ్గా గుర్తించారు. దొంగతనాల వాటా విషయంలో జరిగిన వివాదంతో అతని సహచరులే హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో ఎఫ్. కుమార్ ఎంతోని కుమార్, దీపేశ్ MS మెంటల్, కొప్పుల వెంకటేశ్ వెంగీలను మార్చి 9న గుంటూరు రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.
News March 11, 2026
VASTHU: ఇంట్లో ఫొటో ఫ్రేమ్స్ ఏ దిశలో పెట్టాలంటే?

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో దంపతులు/కుటుంబ సభ్యుల ఫొటోలను నైరుతి దిశలో ఉంచడం శ్రేయస్కరమని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఇది బంధాలను బలోపేతం చేస్తుందని చెబుతున్నారు. ‘స్నేహితులతో దిగిన, విజయాలకు సంబంధించిన ఫొటోలు తూర్పు, ఉత్తర దిశల్లో ఉంచాలి. తద్వారా కీర్తి, పురోగతి లభిస్తాయి. సరైన దిశలో అమర్చిన ఫొటోలు ఇంట్లో సానుకూల శక్తిని నింపి, ఆర్థికంగా, ఆరోగ్యంగా అదృష్టాన్ని తెచ్చిపెడతాయి’ అంటున్నారు.


