News March 11, 2025

జగిత్యాల :గ్రీవెన్స్ డే లో 14 అర్జీదారులు

image

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 14 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా పని చేస్తున్నామన్నారు. పోలీస్ అధికారులు అర్జీదారుల సమస్యను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు.

Similar News

News November 22, 2025

నేను ఒరిజినల్: బాలకృష్ణ

image

ఈ రోజుల్లో ఫిల్మ్ మేకింగ్ పూర్తిగా సాంకేతికతపైనే ఆధారపడి ఉందని నందమూరి బాలకృష్ణ అన్నారు. తన సినిమాలు అసాధారణంగా ఉంటాయని పేర్కొన్నారు. ‘నా సినిమాల్లో అవసరమైతేనే సాంకేతికతను వాడుతా. ఈ రోజుల్లో ప్రతిదానికి టెక్నాలజీని వాడుతున్నారు. హీరోలు సెట్స్‌కు రాకుండా గ్రీన్ మ్యాట్ వేసుకొని షూట్ చేసేస్తున్నారు. నేను అలా కాదు ఒరిజినల్’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన నటించిన అఖండ-2 DEC 5న రిలీజ్ కానుంది.

News November 22, 2025

HBTUలో 29 టీచింగ్ పోస్టులు

image

యూపీలోని హర్‌కోర్ట్ బట్లర్ టెక్నికల్ యూనివర్సిటీ (HBTU) 29 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. MCA, PG, PhD, ME, M.Tech, NET/SET ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://hbtu.ac.in/

News November 22, 2025

HYD: Ibomma రవిని విచారించిన సీపీ

image

Ibomma రవి కేసులో మూడోరోజు కస్టడీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన సైబర్ క్రైమ్ ఆఫీసుకు వెళ్లి రవిని విచారించారు. పైరసీ నెట్ వర్క్, బెట్టింగ్ యాప్‌లతో అతనికున్న సంబంధాలు, విదేశీ కార్యకలాపాల గురించి సీపీ ఆరా తీసినట్లు సమాచారం.