News March 7, 2025
జగిత్యాల: ఘోరం.. అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ

జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం నాగునూర్ గ్రామంలో శుక్రవారం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాజ్యాంగ నిర్మాత బీఆర్.అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేయడం స్థానికంగా ఆందోళన కలిగించింది. ఈ విషయమై దళిత సంఘాల నేతలు స్పందిస్తూ.. ఇది దేశాన్ని, యావత్ సమాజాన్ని అవమానించడమేనని ఆగ్రహం చేశారు. పోలీసులు వెంటనే స్పందించి నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, దేశ ద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
Similar News
News November 18, 2025
టుడే టాప్ స్టోరీస్

* సౌదీలో ఘోర బస్సు ప్రమాదం.. 45మంది హైదరాబాదీలు సజీవదహనం
* ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఉత్తర్వులు
* కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి DECలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని TG క్యాబినెట్ నిర్ణయం
* TG ఫిరాయింపు MLAల కేసులో స్పీకర్పై SC ఆగ్రహం
* బంగ్లా మాజీ PM హసీనాకు మరణశిక్ష
News November 18, 2025
టుడే టాప్ స్టోరీస్

* సౌదీలో ఘోర బస్సు ప్రమాదం.. 45మంది హైదరాబాదీలు సజీవదహనం
* ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఉత్తర్వులు
* కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి DECలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని TG క్యాబినెట్ నిర్ణయం
* TG ఫిరాయింపు MLAల కేసులో స్పీకర్పై SC ఆగ్రహం
* బంగ్లా మాజీ PM హసీనాకు మరణశిక్ష
News November 18, 2025
సామాన్య యువకుడు… ₹9,960 CRకు అధిపతి

MPలోని మారుమూల పల్లెలో పుట్టి, మాతృభాషలో చదువుకున్న ఆ యువకుడు ₹9,960 CRకు అధిపతి అయ్యాడు. ‘Groww’ CEO లలిత్ కేష్రే బిలియనీర్ల జాబితాలో చేరాడు. IIT బాంబేలో చదివిన ఆయన ముగ్గురితో కలిసి 2016లో గ్రోను నెలకొల్పారు. వృద్ధి సాధించిన కంపెనీ FY2025లో ₹4,056Cr ఆదాయంతో ₹1,824Cr లాభాన్ని ఆర్జించింది. తాజాగా మార్కెట్లో లిస్ట్ అయిన దీని క్యాపిటలైజేషన్ ₹1.05L Crకు చేరింది. ఇందులో 55.91Cr షేర్స్ కేష్రేవే.


