News February 18, 2025

జగిత్యాల జిల్లాలోని నేటి CRIME NEWS!

image

@గ్రీవెన్స్ డేలో 10 మంది అర్జీదారులతో ఎస్పీ @మైనర్ బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడికి 45 రోజుల జైలు శిక్ష..రూ.500 జరిమానా @జగిత్యాల పట్టణంలోని ఇంట్లో కాలిన కరెంటు మీటర్ @ఇబ్రహీంపట్నంలో ఎస్ఐ అనిల్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు @కథలాపూర్‌లో యువకుడు ఊరేసుకుని ఆత్మహత్య @పెగడపల్లిలో రైతులను మోసం చేసిన వ్యక్తులను రిమాండ్ చేసిన పోలీసులు @రాయికల్‌లో ఇద్దరు మృతి.. ఆర్థిక సాయం అందజేసిన గ్రామస్థులు

Similar News

News December 1, 2025

వ్యవసాయం కుదేలవుతుంటే చోద్యం చూస్తున్న CBN: జగన్

image

AP: వ్యవసాయం కుప్పకూలిపోతుంటే CM CBN రైతులను వారి విధికి వదిలేసి చోద్యం చూస్తున్నారని YCP చీఫ్ YS జగన్ మండిపడ్డారు. ‘హలో ఇండియా! AP వైపు చూడండి. అక్కడ KG అరటి ₹0.50 మాత్రమే. ఇది నిజం. రైతుల దుస్థితికిది నిదర్శనం. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదు. మా హయాంలో టన్ను అరటికి 25వేలు ఇచ్చాం. రైతులు నష్టపోకుండా ఢిల్లీకి రైళ్లు ఏర్పాటుచేశాం. కోల్డ్ స్టోరేజీలు పెట్టాం’ అని Xలో పేర్కొన్నారు.

News December 1, 2025

నిర్మల్: డీఎడ్ పరీక్షకు 83 మంది హాజరు

image

నిర్మల్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల కస్బాలో జరుగుచున్న డీఎడ్ మొదటి సంవత్సరం పరీక్షలకు 93 మంది విద్యార్థులకు గాను 83 మంది విద్యార్థులు హాజరుకాగా పదిమంది గైరాజరయ్యారని డీఈవో భోజన్న తెలిపారు. పరీక్ష కేంద్రాన్ని పాఠశాల విద్యాశాఖ వరంగల్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు కే సత్యనారాయణ రెడ్డి, నిర్మల్ ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ముడారపు పరమేశ్వర్ సందర్శించారు.

News December 1, 2025

తణుకులో గుర్తుతెలియని మృతదేహం కలకలం

image

తణుకు పట్టణంలో సోమవారం గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రాష్ట్రపతి రోడ్డులోని కోర్టు సమీపంలో సుమారు 50 ఏళ్లు వయసు కలిగిన మృతదేహం ఉన్నట్లు స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు స్థానికంగా యాచకం చేస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.