News February 18, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి CRIME NEWS!

@గ్రీవెన్స్ డేలో 10 మంది అర్జీదారులతో ఎస్పీ @మైనర్ బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడికి 45 రోజుల జైలు శిక్ష..రూ.500 జరిమానా @జగిత్యాల పట్టణంలోని ఇంట్లో కాలిన కరెంటు మీటర్ @ఇబ్రహీంపట్నంలో ఎస్ఐ అనిల్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు @కథలాపూర్లో యువకుడు ఊరేసుకుని ఆత్మహత్య @పెగడపల్లిలో రైతులను మోసం చేసిన వ్యక్తులను రిమాండ్ చేసిన పోలీసులు @రాయికల్లో ఇద్దరు మృతి.. ఆర్థిక సాయం అందజేసిన గ్రామస్థులు
Similar News
News December 4, 2025
సమంత-రాజ్ పెళ్లి.. మాజీ భార్య ఎమోషనల్ పోస్ట్

రాజ్-సమంత పెళ్లి చేసుకున్న మూడు రోజులకు రాజ్ మాజీ భార్య శ్యామలి ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘నాపై ప్రేమ, మద్దతు చూపిస్తున్న వారికి రిప్లై ఇవ్వలేకపోయినందుకు క్షమించాలి. ఇటీవల ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. తిరుగుతూ, వాదించుకుంటూ గడిచిన రోజులు ఉన్నాయి. గత నెల 9న నా జ్యోతిష్య గురువుకు స్టేజ్ 4 క్యాన్సర్ నిర్ధారణ అయింది. నాకు PR టీమ్ లేదు. స్వయంగా రెస్పాండ్ అవుతున్నా. అందరికీ ధన్యవాదాలు’ అని తెలిపారు.
News December 4, 2025
GVMC స్థాయి సంఘంలో ఇష్టారాజ్యంగా ప్రతిపాదనలు..

GVMC స్థాయి సంఘం సమావేశం శనివారం జరగనుంది. మొత్తం 257 అంశాలతో అజెండా కాపీలను సిద్ధం చేసి సభ్యులకు అందజేశారు. ఇన్ని అంశాలను ఒకే సారి పెట్టడం ద్వారా ఎలాంటి చర్చ లేకుండా అమోదించే అవకాశం ఉంది. దీంతో ఆయా అంశాలను స్థాయి సంఘం సభ్యులు పూర్తిగా చదివే అవకాశం కూడా లేకుండా పోతుంది. ప్రజాధనాన్ని అవసరం ఉన్నా.. లేకపోయినా ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
News December 4, 2025
టైర్లు ధ్వంసమైనా, నీటిలోనూ ప్రయాణం ఆగదు

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ <<18465862>>పర్యటన<<>> వేళ ఆయన ప్రయాణించే “ఆరస్ సెనాట్” కారుపై చర్చ జరుగుతోంది. ఇది ప్రపంచంలో అత్యంత సురక్షిత వాహనాల్లో ఒకటి. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ కారు బాంబులు, క్షిపణి దాడులను సైతం తట్టుకుంటుంది. నీటిలో మునిగిపోయినా ఇది తేలి సురక్షిత ప్రాంతానికి చేర్చుతుంది. ప్రత్యేకంగా కస్టమైస్డ్ అయిన ఈ కారు ధర సుమారు రూ.5కోట్లు ఉంటుంది. ఇది సాధారణ పౌరులకు అందుబాటులో లేదు.


