News February 18, 2025

జగిత్యాల జిల్లాలోని నేటి CRIME NEWS!

image

@గ్రీవెన్స్ డేలో 10 మంది అర్జీదారులతో ఎస్పీ @మైనర్ బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడికి 45 రోజుల జైలు శిక్ష..రూ.500 జరిమానా @జగిత్యాల పట్టణంలోని ఇంట్లో కాలిన కరెంటు మీటర్ @ఇబ్రహీంపట్నంలో ఎస్ఐ అనిల్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు @కథలాపూర్‌లో యువకుడు ఊరేసుకుని ఆత్మహత్య @పెగడపల్లిలో రైతులను మోసం చేసిన వ్యక్తులను రిమాండ్ చేసిన పోలీసులు @రాయికల్‌లో ఇద్దరు మృతి.. ఆర్థిక సాయం అందజేసిన గ్రామస్థులు

Similar News

News March 21, 2025

ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు రూ.258కోట్లు

image

ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చును కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే ప్రధాని పర్యటనల ఖర్చును తెలపాలని కోరగా విదేశాంగ శాఖ బదులిచ్చింది. 2022 మే నుంచి 2024 డిసెంబర్ వరకూ ప్రధాని 38 విదేశీ పర్యటనలకు చేయగా రూ. 258కోట్లు ఖర్చయినట్లు తెలిపింది. 2023 జూన్‌లో జరిగిన అమెరికా పర్యటనకు అధికంగా రూ.22కోట్లు ఖర్చు జరిగినట్లు తెలిపింది.

News March 21, 2025

మెదక్: రూ.1,70,42,046 ఆస్తిపన్ను చెల్లించిన జిల్లా జడ్జి

image

మెదక్ కోర్టు భవనాల ఆస్తి పన్ను బకాయి మొత్తాన్ని జిల్లా జడ్జి లక్ష్మీ శారద చెల్లించారు. జిల్లా జడ్జికి మెదక్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గత కొంతకాలంగా కోర్టు భవనాల ఆస్తిపన్ను బకాయి ఉండడం వల్ల ఈ విషయాన్ని జిల్లా జడ్జి లక్ష్మీ శారద దృష్టికి మున్సిపల్ అధికారులు తీసుకెళ్లారు. తక్షణమే స్పందించి రూ.1,70,42,046 ను గురువారం చెల్లించారు.

News March 21, 2025

ASF: 400 మందికి దరఖాస్తులు కావడం లేదు..!

image

జిల్లాలోని నాయీ బ్రాహ్మణులు నేడు జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. గత 2023-24 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలోని నాయీ బ్రాహ్మణులు 400మంది బీసీ బంధు కోసం దరఖాస్తు చేసుకున్నామన్నారు. అది రాకపోగా.. నేడు రాజీవ్ యువ వికాసం కోసం దరఖాస్తులు కావడం లేదని వాపోయారు. ఆన్‌లైన్ చేస్తుంటే అప్లై కావడం లేదని.. సమస్యను పరిష్కరించాలని కోరారు.

error: Content is protected !!