News February 19, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి TOP NEWS!

@జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం @రాష్ట్రస్థాయి పోటిల్లో జగిత్యాల బిడ్డల సత్తా @కలెక్టర్తో సీఎస్ వీడియో సమావేశం @గొల్లపల్లి విద్యార్థికి అథ్లెటిక్స్ సిల్వర్ మెడల్ @కథలాపూర్లో జిల్లా వైద్యాధికారి తనిఖీలు @మల్లాపూర్లో పర్యటించిన DRDO PD@కొండగట్టులో భక్తుల రద్దీ @జగిత్యాలలో ఘనంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం @కోరుట్ల మల్లన్న జాతరలో పాల్గొన్న MLA సంజయ్
Similar News
News September 17, 2025
WGL: అయోమయానికి గురిచేస్తున్న పత్తి ధర!

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు అన్నదాతలను అయోమయానికి గురిచేస్తున్నాయి. సోమవారం క్వింటా రూ.7,400 ధర పలకగా.. మంగళవారం రూ.7,480 అయింది. మళ్లీ ఈరోజు(బుధవారం) ధర తగ్గి రూ. 7,440 అయింది. రైతులు తేమలేని, నాణ్యమైన పత్తి మార్కెట్కి తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచిస్తున్నారు
News September 17, 2025
దత్తతతో దేశం దాటి.. మూలాల కోసం మళ్లీ వచ్చింది..!

దత్తతతో దేశం దాటిన మహిళ తన తల్లిదండ్రుల మూలాల కోసం మళ్లీ తిరిగి మాతృ దేశానికి వచ్చింది. వరంగల్ శివనగర్లో తన మూలాలు ఉన్నాయని గుర్తించి చివరకు తన తల్లిదండ్రులను కలుసుకుంటానని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 36 ఏళ్ల క్రితం సంధ్యారాణి అనే మహిళ దత్తతతో స్వీడన్ దేశానికి వెళ్లింది. పెరిగి పెద్దై ఉన్నత చదువుల్లో రాణించి 2009 నుంచి అన్వేషించింది. చివరకు తనది పద్మశాలి సామాజిక వర్గమని తెలుసుకుంది.
News September 17, 2025
GST సంస్కరణలతో వారికి మేలు: సత్యకుమార్

AP: జీఎస్టీ సంస్కరణలు మధ్యతరగతి, పేదలకు మేలు చేసేలా ఉన్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ మార్పులతో ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను పెంచి, వస్తువుల ధరలు నియంత్రణలోకి వస్తాయని తెలిపారు. 2047నాటికి భారత్ను 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు కేంద్రం శ్రమిస్తోందన్నారు. గత ఐదేళ్లలో దివాళా తీసిన రాష్ట్ర ఎకానమీని కూటమి ప్రభుత్వం గాడిన పెడుతోందని తెలిపారు.