News January 26, 2025

జగిత్యాల జిల్లాలోని నేటి ముఖ్యంశాలు!

image

1.జిల్లా వ్యాప్తంగా జాతీయ ఓటర్ దినోత్సవం 2.జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైన పాఠశాలలు, కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ లు 3.రేపు మండలాల్లోని ఎంపిక చేసిన గ్రామాల్లో 4 పథకాల అమలు ప్రారంభ కార్యక్రమం 4.ముత్యంపేటలో ఇద్దరికీ కత్తిపోట్లు 5.మెట్పల్లి సిఐ కి ఇండియన్ పోలీస్ మెడల్ అవార్డు 6.కొడిమ్యాలలో పెద్దపులి.. గాలిస్తున్న ఫారెస్ట్ అధికారులు 7.జగిత్యాల పాఠశాలలో విద్యార్థులతో స్వీపర్ పనులు

Similar News

News November 25, 2025

FLASH: బోరబండలో నిప్పు అంటించుకున్న హిజ్రాల్లో ముగ్గురి మృతి

image

ట్రాన్స్‌జెండర్ మోనాలిసాకు వ్యతిరేకంగా ఇటీవల బోరబండ బస్టాండ్‌లో ఓ వర్గం చేపట్టిన ఆందోళన తీవ్ర విషాదంగా మారింది. ఆందోళన సమయంలో పెట్రోల్ పోసుకున్న ట్రాన్స్‌జెండర్లలో చికిత్స పొందుతూ మంగళవారం నవనీత (24) బాలానగర్‌లోని ఓ ఆస్పత్రిలో మరణించింది. ఈ నెల 20న అప్సానా, 23న హీనా కూడా చనిపోయిన సంగతి తెలిసిందే. బోరబండ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య మూడుకు చేరింది.

News November 25, 2025

బలవంతపు వాంతులతో క్యాన్సర్‌: వైద్యులు

image

బ్రష్ చేశాక చాలా మంది గొంతులోకి వేళ్లు పెట్టి బలవంతంగా వాంతులు చేసుకుంటారు. అలా పదే పదే చేస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘కడుపులోని యాసిడ్ పదేపదే పైకి తన్నడం వల్ల అన్నవాహికలోని ‘టైల్స్’ లాంటి సున్నితమైన కణాలు అరిగిపోతాయి. ఇలా మాటిమాటికీ జరిగితే తీవ్రమైన సందర్భాల్లో క్యాన్సర్ కణాలుగా మారే ప్రమాదం ఉంటుంది. నాలుకను గీసుకొని ముఖం కడుక్కుంటే చాలు’ అని సూచించారు.

News November 25, 2025

5న తిరుమల దర్శనం టికెట్ల విడుదల

image

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి TTD కీలక ప్రకటన వెలువరించింది. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు రోజుకు 15000 చొప్పున రూ.300 టికెట్లు ఇస్తామని తెలిపింది. డిసెంబర్ 5వ తేదీన మధ్యాహ్నం 3గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లను విడుదల చేస్తామని వెల్లడించింది. ఆరోజు టీటీడీ వెబ్‌సైట్ ద్వారానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలని సూచించింది.