News January 26, 2025

జగిత్యాల జిల్లాలోని నేటి ముఖ్యంశాలు!

image

1.జిల్లా వ్యాప్తంగా జాతీయ ఓటర్ దినోత్సవం 2.జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైన పాఠశాలలు, కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ లు 3.రేపు మండలాల్లోని ఎంపిక చేసిన గ్రామాల్లో 4 పథకాల అమలు ప్రారంభ కార్యక్రమం 4.ముత్యంపేటలో ఇద్దరికీ కత్తిపోట్లు 5.మెట్పల్లి సిఐ కి ఇండియన్ పోలీస్ మెడల్ అవార్డు 6.కొడిమ్యాలలో పెద్దపులి.. గాలిస్తున్న ఫారెస్ట్ అధికారులు 7.జగిత్యాల పాఠశాలలో విద్యార్థులతో స్వీపర్ పనులు

Similar News

News November 25, 2025

విశాఖ: ప్రియరాలి వేధింపులతో ఆత్మహత్య?

image

గాజువాక సమీపంలోని తుంగ్లం పక్కన చుక్కవానిపాలెంలో రాజేశ్ రెడ్డి (30) ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రియురాలు వేధింపులే కారణమని యువకుని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. కాగా కొద్దిరోజుల కిందట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా.. మిత్రులు నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చినట్లు సమాచారం. దీనిపై గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 25, 2025

పాలిష్ బియ్యం తింటే కలిగే నష్టాలేంటో తెలుసా?

image

తెల్లగా కనిపించే పాలిష్ రైస్ తినడం మంచిది కాదని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరానికి తగినంత B1 అందక బెరిబెరి వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నందున రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగి టైప్2 డయాబెటిస్ రావచ్చు. ఫైబర్ తక్కువగా ఉండడంతో అజీర్ణం, కడుపు ఉబ్బరం, శ్వాస సంబంధ సమస్యలు వచ్చే చాన్స్ ఉంది. శరీరానికి అవసరమైన పోషకాలు అందక కీళ్ల నొప్పులు వస్తాయి.

News November 25, 2025

GNT: ఎండు మిర్చి రేట్లకు ఊపు.. రైతుల్లో నూతన ఆశ

image

రెండేళ్ల నష్టాల తరువాత ఎండు మిర్చి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. క్వింటాలు రూ.20 వేల దాటే సూచనలు కనిపిస్తున్నాయి. శీతల గోదాముల స్టాక్ తగ్గడం, కొత్త పంట మార్కెట్లో తక్కువగా వచ్చే అవకాశమే ప్రధాన కారణం. గత ఏడాది 3.64 లక్షల ఎకరాల్లో సాగు కాగా ఈసారి 2.67 లక్షలకు పడిపోయింది. ఈ పరిస్థితుల్లో నవంబర్ మూడో వారానికి మూడు రకాల మిర్చి ధరలు ఎగబాకాయి. క్వింటాకు రూ.18,600 వరకు నమోదైంది.