News January 26, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి ముఖ్యంశాలు!

1.జిల్లా వ్యాప్తంగా జాతీయ ఓటర్ దినోత్సవం 2.జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైన పాఠశాలలు, కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ లు 3.రేపు మండలాల్లోని ఎంపిక చేసిన గ్రామాల్లో 4 పథకాల అమలు ప్రారంభ కార్యక్రమం 4.ముత్యంపేటలో ఇద్దరికీ కత్తిపోట్లు 5.మెట్పల్లి సిఐ కి ఇండియన్ పోలీస్ మెడల్ అవార్డు 6.కొడిమ్యాలలో పెద్దపులి.. గాలిస్తున్న ఫారెస్ట్ అధికారులు 7.జగిత్యాల పాఠశాలలో విద్యార్థులతో స్వీపర్ పనులు
Similar News
News February 19, 2025
HYD: గుండెపోటుతో మరో లాయర్ మృతి..!

HYDలో నేడు మరో లాయర్ గుండెపోటుతో మృతి చెందారు. తార్నాకకు చెందిన లాయర్ వెంకటరమణ మారేడ్పల్లిలోని ఇండియన్ బ్యాంక్లో చలానా కట్టేందుకు వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలారని స్థానికులు తెలిపారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిన్న హైకోర్టులో వాదనలు వినిపిస్తూనే లాయర్ వేణుగోపాల్ రావు మరణించిన సంగతి తెలిసిందే. వరుస హార్ట్ఎటాక్లు HYDలో భయాందోళనలు కలిగిస్తున్నాయి.
News February 19, 2025
అలాంటి వారికే పదవులు: మంత్రి లోకేశ్

AP: మంచి చేస్తున్న ప్రభుత్వంపై YCP దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని TDP శ్రేణులకు మంత్రి లోకేశ్ సూచించారు. తిరుపతి నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశమైన ఆయన, పార్టీని బలోపేతం చేసేందుకు ఐకమత్యంగా కృషి చేయాలని కోరారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఎవరు అంకితభావంతో పనిచేశారో తెలుసుకుని వారికే పదవులు ఇస్తామన్నారు. ‘ఎన్నికల్లో గెలిచాం.. తిరుగులేదనే ధోరణి సరికాదు. నిత్యం ప్రజల్లో ఉండాలి’ అని సూచించారు.
News February 19, 2025
పాడేరు: అసంఘటితరంగ కార్మికులను ఈ-శ్రమ పోర్టల్లో నమోదు చేయాలి

అసంఘటిత రంగ కార్మికులను ఈ-శ్రమ పోర్టల్లో నమోదు చేయాలని అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ బుధవారం సంబంధిత అధికారులను ఆదేశించారు. అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ-శ్రమ పోర్టల్ అందుబాటులోకి తీసుకుని వచ్చిందన్నారు. వివిధ శాఖలలో విధులు నిర్వహిస్తున్న కార్మికులను ఈ-శ్రమలో నమోదు చేసి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను అందించాలన్నారు.