News March 31, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి ముఖ్యంశాలు!

@జిల్లా వ్యాప్తంగా ఉగాది పండుగ వేడుకలు
@ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రూ.2,22,450 ఆదాయం @కొండగట్టు అంజన్న స్థానాచార్యులకు ఉగాది పురస్కారం @కథలాపూర్ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి రూ.50వేల విరాళం @పలు మండలాల్లో జింక మల్లన్న స్వామి బోనాలు @మెట్పల్లి: జిల్లా ఫస్ట్ అడిషనల్ జడ్జికి సన్మానం @జగిత్యాలలో హనుమాన్ మాలధారుల బైక్ ర్యాలీ @బీర్పూర్లో ఎడ్ల బండి పోటీలు @కొండగట్టులో భక్తుల రద్దీ
Similar News
News December 4, 2025
‘అఖండ-2’ మూవీ.. ఫ్యాన్స్కు బిగ్ షాక్

అఖండ2 ప్రీమియర్స్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న బాలయ్య ఫ్యాన్స్కు డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ షాకిచ్చింది. సాంకేతిక కారణాలతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియాలో ప్రీమియర్స్ ఉండవని 14 రీల్స్ ప్లస్ సంస్థ ప్రకటించింది. ఓవర్సీస్లో మాత్రం యథావిధిగా ప్రీమియర్స్ ఉంటాయంది. ఇవాళ రాత్రి గం.8 నుంచి షోలు మొదలవుతాయని ప్రకటన వచ్చినా టికెట్స్పై సమాచారం లేక ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.
News December 4, 2025
ఏలూరు: భర్తను బెదిరించబోయి.. ప్రాణాలు కోల్పొయింది

భర్త మద్యం మానేయాలని బెదిరించే క్రమంలో పురుగుల మందు తాగి మహిళ మృతి చెందిన ఘటన అడవికొలనులో చోటుచేసుకుంది. నిడమర్రు ఎస్ఐ రమేష్ కథనం ప్రకారం… గ్రామానికి చెందిన చిన్నిపిల్లి లక్ష్మి.. మద్యానికి బానిసైన తన భర్తను తాగుడు మాన్పించాలని గురువారం బెదిరించేందుకు, సోడా సీసాలో ఉన్న పురుగుల మందు తాగింది. స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింనట్లు ఎస్ఐ వెల్లడించారు.
News December 4, 2025
కామారెడ్డి: చిత్తడి నేలల సంరక్షణకు కలెక్టర్ కీలక ఆదేశాలు

కామారెడ్డి జిల్లాలోని చిత్తడి నేలలను గుర్తించడం, సంరక్షణ చర్యలపై గురువారం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన ఇంటర్ డిపార్ట్మెంట్ అధికారుల సమావేశం జరిగింది. కలెక్టర్ ఆదేశాల మేరకు, సహజ, కృత్రిమ చెరువులు, కుంటలు వంటి చిత్తడి నేలలను ప్రమాణాల ప్రకారం గుర్తించాలని అధికారులకు సూచించారు. రెవెన్యూ, అరణ్య, నీటిపారుదల, ఫిషరీస్ శాఖల సంయుక్త బృందం ఫీల్డ్ సర్వే త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు.


