News February 5, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి ముఖ్యంశాలు!

@EVM గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్ @కొడిమ్యాల లోని నల్లగొండ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న కలెక్టర్ @మల్యాలలో ఛలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ @ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో రూ.1,27,995 రూపాయల ఆదాయం @జగిత్యాల ఎమ్మెల్యేను కలిసిన దళిత సంఘ నాయకులు @బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న బీర్పూర్ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం @ఇకనుంచి జగిత్యాల ఆర్టీసీ కార్గో సేవల్లో హోమ్ డెలివరీ
Similar News
News October 14, 2025
కోడూరు: ‘ట్రైన్లో నిద్రిస్తూనే కన్నుమూశాడు’

కోడూరు(M) పోటుమీదతకు చెందిన శీలం బాపనయ్య(65) షిరిడీ యాత్రకు వెళ్లి మంగళవారం ఉదయం మృతి చెందారు. సోమవారం ఇంటి వద్ద నుంచి తోటి యాత్రికులతో కలిసి షిరిడీ బయలుదేరారు. మంగళవారం షిరిడీ సమీపంలో నాగర్ సోల్ రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగేందుకు నిద్రిస్తున్న బాపనయ్యను లేపగా అప్పటికే మృతి చెందినట్లు తోటి వారు తెలిపారు. బాపనయ్య మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.
News October 14, 2025
మల్దకల్: ప్రియాంక మృతికి కారకురైన వారిని వదిలేది లేదు- ఎమ్మెల్యే

మల్దకల్ మండల కేంద్రానికి చెందిన విద్యార్థిని ప్రియాంక మృతికి కారకులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మల్దకల్లో మృతదేహంతో ప్రియాంక కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హుటాహుటిన అక్కడికి చేరుకొని తల్లిదండ్రులను ఓదార్చారు. ప్రియాంక మృతిపై పూర్తిస్థాయి పోలీసులతో విచారణ చేస్తామన్నారు.
News October 14, 2025
పాల్వంచ: ఐదుసార్లు ఎమ్మెల్యే.. అయినా క్యూలో

ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తేనే మంది మార్బలం, హంగు ఆర్భాటాలతో నానా హంగామా చేస్తుంటారు కొందరు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సాదాసీదా ఉండడమే ఇల్లందు మాజీ ఎమ్మెల్యే నర్సయ్య నైజం. బస్సులో అసెంబ్లీకి వెళ్లిన ఆయన సింప్లిసిటీ అందరికీ తెలిసిందే. తాజాగా కంటి పరీక్షల కోసం పాల్వంచ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి సైకిల్పై వెళ్లడం, ఓపీ క్యూలో నిలబడడం అందరి దృష్టిని ఆకర్షించింది.