News April 4, 2025

జగిత్యాల: జిల్లాలో తగ్గిన ఎండ తీవ్రత

image

జగిత్యాల జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గాయి. గురువారం రాయికల్, నేరెళ్లలో 37.9℃. అల్లీపూర్, గోదూరు 37.8, ధర్మపురి 37.7, సిరికొండ 37.6, జైన, వెల్గటూర్ 37.5, కథలాపూర్, గొల్లపల్లె 37.3, కోరుట్ల, మెట్పల్లె 37.1, పెగడపల్లె 36.9, మారేడుపల్లి 36.6, ఐలాపూర్, మల్లాపూర్ 36.5, మేడిపల్లిలో 36.4℃ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా మబ్బులు కమ్ముకోవడంతో మధ్యాహ్నం నుంచి జిల్లాలో ఎండ తీవ్రత చాలా తగ్గిపోయింది.

Similar News

News April 8, 2025

నేడు గుజరాత్‌కు సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ ఈరోజు గుజరాత్‌కు వెళ్లనున్నారు. అహ్మదాబాద్‌లో 2 రోజుల పాటు జరిగే ఏఐసీసీ ప్రత్యేక సమావేశాలకు ఆయన హాజరవనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి నిన్నే అక్కడికి చేరుకోగా మంత్రులతో కలిసి సీఎం నేడు పయనమవుతారు. బీసీ కులగణన, రిజర్వేషన్ల పెంపు తీర్మానంపై సీఎం ప్రసంగిస్తారని తెలుస్తోంది. రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలపై ఈ సమావేశంలో రేవంత్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం.

News April 8, 2025

భారతీయులు గొప్ప ప్రతిభావంతులు: బిల్ గేట్స్

image

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారతీయులపై ప్రశంసలు కురిపించారు. ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఇండియన్స్ గురించి మాట్లాడారు. ‘భారతీయులు గొప్ప ప్రతిభావంతులు. సమస్యల్ని సులభంగా పరిష్కరించడం వారికి వెన్నతో పెట్టిన విద్య. డిజిటల్ రంగంలోనూ ఇండియా శరవేగంగా దూసుకెళ్తోంది. భారత్‌లోని పేదలు కూడా చాలా తెలివైన వారు కానీ అవకాశాల్లేక వెనుకబడుతున్నారు’ అని పేర్కొన్నారు.

News April 8, 2025

సిరిసిల్ల: ఇసుక రీచ్‌లు ప్రారంభించాలి: కలెక్టర్

image

రేపటి నుంచి పదిర, కొండాపూర్ ఇసుక రీచులను ప్రారంభించాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో ఇసుక రీచ్‌లపై ఏర్పాటుపై అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో నూతనంగా నిర్మించే ప్రభుత్వ ప్రాజెక్టులు, ఇందిరమ్మ ఇల్లు, పెండింగ్ డబల్ బెడ్‌రూమ్ ఇళ్ళ నిర్మాణానికి ఎక్కడ కూడా ఇసుక కొరత రాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

error: Content is protected !!