News March 26, 2025

జగిత్యాల జిల్లాలో నేటి ఉష్ణోగ్రతలు

image

జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు కొన్ని రోజులుగా చల్లగా ఉన్న వాతావరణం బుధవారం వేడెక్కింది. బుధవారం జిల్లాలోని బీర్పూర్ మండలం కొల్వాయిలో అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, వెల్గటూర్, జగిత్యాల మండలాల్లో 36.6 డిగ్రీలు రాయికల్ మండలంలో 39.4, గొల్లపల్లిలో 39.2, బుగ్గారంలో 39.2, కోరుట్ల లో 39.2, మేడిపల్లిలో 39.1, ఇబ్రహీంపట్నం, సారంగాపూర్ మండలాల్లో 39.1 భీమారంలో 39.0, మేడిపల్లి లో 39.1 ఉంది.

Similar News

News December 31, 2025

సినిమాను మించిన సక్సెస్ స్టోరీ.. ఎందరికో ఆదర్శం!

image

ఒకప్పుడు వీధుల్లో భిక్షాటన చేసిన కర్ణాటకకు చెందిన రేణుకా ఆరాధ్య నేడు వందలాది మందికి ఉపాధినిస్తున్నారు. పేదరికం వల్ల బాల్యంలో తండ్రితో కలిసి ఆలయాల ముందు భిక్షాటన చేసిన ఆయన సెక్యూరిటీగార్డుగా, క్లీనర్‌గా చేసి ఎన్నో కష్టాలు పడ్డారు. కానీ డ్రైవర్‌గా మారడం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. సొంతంగా కారు కొని ‘ప్రవాసీ క్యాబ్స్’ ప్రారంభించి దానిని రూ.40 కోట్ల టర్నోవర్ కంపెనీగా మార్చి ఔరా అనిపించారు.

News December 31, 2025

విభూది మహిమ..

image

విభూతి వెనుక ఆరోగ్య రహస్యాలెన్నో ఉన్నాయి. ఇది శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు శరీరాన్ని వెచ్చగా, ఎండగా ఉన్నప్పుడు చల్లగా ఉంచుతుంది. చర్మ రంధ్రాలను క్రమబద్ధీకరించి లోపలి శక్తి బయటకు పోకుండా కాపాడుతుంది. అందుకే మైనస్ డిగ్రీల చలిలో కూడా నాగసాధువులు విభూతిని పూసుకుని జీవించగలుగుతారు. పూర్వం స్వెటర్లు లేని రోజుల్లో పిల్లలకు చలి తగలకుండా విభూతిని ఒంటికి పూసేవారు.

News December 31, 2025

గద్వాల్: మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేయండి- కలెక్టర్

image

పురపాలికల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు. బుధవారం గద్వాల కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మున్సిపల్ ఎన్నికలు,పురపాలికల్లో అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి కలెక్టర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.