News April 11, 2025

జగిత్యాల జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత

image

జగిత్యాల జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గురువారం అల్లీపూర్‌లో అత్యధికంగా 40.9℃ఉష్ణోగ్రత నమోదైంది. అటు జైన 40.8, మారేడుపల్లి 40.7, వెల్గటూర్, గోదూరు 40.5, ఐలాపూర్ 40.4, సారంగాపూర్, మెట్పల్లి 40.2, ధర్మపురి, మేడిపల్లి 40.1, రాయికల్ 40.0, ఎండపల్లి, మల్లాపూర్, సిరికొండ, నేరెల్ల, రాఘవపేటలో 39.4℃ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత అధికంగానే ఉంది.

Similar News

News December 9, 2025

మీకు ఈ అలవాట్లు ఉన్నాయా?

image

కొన్ని అలవాట్లు అశుభకరమని పండితులు చెబుతున్నారు. ‘మాటిమాటికి ప్రతిజ్ఞలు చేయడం, ఒట్లు వేయడం దోషం. నిలబడి, తిరుగుతూ అన్నం తింటే దరిద్రులవుతారు. నోట్లో వేళ్లు పెట్టుకోవడం, గోళ్లు కొరుక్కోవడం అశుభానికి సంకేతం. నదిలో ఉమ్మడం దైవ దూషణతో సమానం. కంచంను ఒడిలో పెట్టుకొని, పడుకొని తినకూడదు. కంచంలో చేయి కడగడం కూడా మంచిది కాదు. ఈ అలవాట్లు వీడితే శుభాలు కలిగి, మీ జీవితం సంతోషంగా ఉంటుంది’ అని సూచిస్తున్నారు.

News December 9, 2025

ఇళ్ల స్థలాల దరఖాస్తుల్లో పెండింగ్ ఉండరాదు: JC

image

ఇంటి నివేశన స్థలాల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలన చేసి అర్హులైన లబ్దిదారుల వివరాలను పెండింగ్‌లో లేకుండా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని జేసీ గోపాలకృష్ణ అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్‌లో సోమవారం జేసీ మాట్లాడుతూ.. ఇంటి పట్టాల రీ- వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. అలాగే ఇంటి పట్టాల రీ-వెరిఫికేషన్‌పై MROలు ప్రత్యేక దృష్టి సారించి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.

News December 9, 2025

BSWD: “మా కుటుంబ ఓట్లు అమ్మబడవు”

image

బాన్సువాడ నియోజకవర్గం, మోస్రా మండలం గోవూర్‌లో ఎన్నికల నేపథ్యంలో నవీన్ రెడ్డి వినూత్న రీతిలో ప్లెక్సీ ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీ చేసే అభ్యర్థులను ఉద్దేశించి, “మా కుటుంబ ఓట్లు అమ్మబడవు” అని ఇంటి వద్ద ప్లెక్సీని ఏర్పాటు చేశారు. ఓటుకు నోటు తీసుకోకుండా, స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇతరులకు ఆదర్శంగా నిలిచారు.