News March 4, 2025

జగిత్యాల జిల్లాలో భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు..!

image

జగిత్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం పెగడపల్లి, మల్యాల్, ఐలాపూర్, అల్లిపూర్, కొల్వాయి, వెల్గటూర్, ధర్మపురి, సిరికొండ, గొల్లపల్లిలో 39.2℃, మన్నెగూడెం, నేరెళ్ల, మారేడుపల్లి, రాఘవపేట 39.1, సారంగాపూర్ 38.9, గోదూరు, రాయికల్, పూడూర్ 38.8, మేడిపల్లె, ఎండపల్లి, గుల్లకోట, జగిత్యాల, కోరుట్ల 38.7, మెట్‌పల్లి, మద్దుట్ల, మల్లాపూర్ 38.6, తిరుమలాపూర్ 38.1, జైన 37.9℃గా ఉష్ణోగ్రత నమోదైంది.

Similar News

News December 13, 2025

పడమర దిక్కులో బోరు బావి ఉండవచ్చా?

image

సాధారణంగా ఇంటికి అవసరమయ్యే నీటి వనరులు ఈశాన్యం/ ఉత్తర దిక్కులలో ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. అయినప్పటికీ పడమర దిక్కులో బోరు వేయడం వలన నీటి అవసరం తీరుతుంది కాబట్టి ఇది వాస్తు పరంగా ఆమోదయోగ్యమే అని అంటున్నారు. ‘నీరు అనేది ప్రాథమిక అవసరం కాబట్టి, దానిని మంచి స్థలంలో నిల్వ చేసుకున్నా, నిత్యం అందుబాటులోకి తెచ్చినా తప్పేం ఉండదు. దీని వలన మంచి ఫలితాలు పొందవచ్చు’ అంటున్నారు.<<-se>>#Vasthu<<>>

News December 13, 2025

15న జరగాల్సిన PGRS కార్యక్రమం రద్దు: ఇలక్కియా

image

భవానీ దీక్షల విరమణ విధుల్లో జిల్లా అధికారులు నిమగ్నమై ఉన్నందున ఈ నెల 15న జరగాల్సిన జిల్లాస్థాయి PGRS కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ఇలక్కియా తెలిపారు. తదుపరి సోమవారం నుంచి PGRS యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు తమ అర్జీలను Meekosam.ap.gov.inలో నమోదు చేసుకోవచ్చని, వివరాల కోసం 1100కు కాల్ చేయవచ్చని పేర్కొన్నారు.

News December 13, 2025

లోక్ అదాలత్‌లో 19,577 కేసులు పరిష్కారం

image

జాతీయ లోక్‌అదాలత్‌లో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మొత్తం 19,577 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్తి తెలిపారు. జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో 28 బెంచీల ద్వారా 284 సివిల్, 19,096 క్రిమినల్, 197 మోటార్ యాక్సిడెంట్ కేసులను పరిష్కరించారు. మోటార్ ప్రమాదాలకు సంబంధించిన కేసుల్లో బాధితులకు రూ. 6.34 కోట్ల నష్టపరిహారం చెల్లించినట్లు ఆయన వివరించారు.